అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పోరాడి ఓడిన సాకేత్
Published on Sat, 07/21/2018 - 00:56
అస్తానా: ప్రెసిడెంట్స్ కప్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్, భారత డేవిస్కప్ జట్టు సభ్యుడు సాకేత్ మైనేని పోరాటం ముగిసింది. కజకిస్తాన్లోని అస్తానాలో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్ 4–6, 7–6 (12/10), 5–7తో డానియల్ బ్రాండ్స్ (జర్మనీ) చేతిలో పోరాడి ఓడిపోయాడు.
2 గంటల 26 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సాకేత్ 13 ఏస్లు సంధించడంతోపాటు తన సర్వీస్ను నాలుగుసార్లు కోల్పోయాడు. క్వార్టర్స్లో ఓడిన సాకేత్కు 3,650 డాలర్ల ప్రైజ్మనీ (రూ. 2 లక్షల 50 వేలు)తోపాటు 18 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
#
Tags