అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
మేం కళ్లు మూసుకోం...
Published on Wed, 04/16/2014 - 14:51
న్యూఢిల్లీ: ఐపీఎల్ బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో ఎన్. శ్రీనివాసన్, మరో 12 మందిపై బీసీసీఐ విచారణ జరపాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బీసీసీఐ స్వయంప్రతిపత్తి గల సంస్థ అయిన బీసీసీఐ ఈ వ్యవహారంపై మిన్నకున్నా తాము మాత్రం కళ్లు మూసుకోమని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. జస్టిస్ ముకుల్ ముగ్దల్ కమిటీ తన నివేదికలో చేసిన ఆరోపణలపై విచారణ జరగాల్సిందేనని స్పష్టం చేసింది.
కమిటీ ప్రతిపాదనలను శ్రీనివాసన్ సీరియస్గా తీసుకోకపోవడాన్ని కోర్టు తప్పుబట్టింది. ఐపీఎల్-7కు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా సుందర్ రామన్ను కొనసాగించేందుకు కోర్టు అనుమతించింది. సిట్ లేదా సీబీఐతో దర్యాప్తు చేయించాలనే దానిపై నిర్ణయాన్ని జస్టిస్ ఏకే పట్నాయక్ నేతృత్వంలోని బెంచ్ రిజర్వు చేసింది.
#
Tags