రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విష్ణు–బాలాజీ జంట ఓటమి
Published on Thu, 06/07/2018 - 10:33
సాక్షి, హైదరాబాద్: సర్బిటాన్ ట్రోఫీ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్ నుంచి హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ (భారత్) జంట నిష్క్రమించింది. ఇంగ్లండ్లో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ ద్వయం 4–6, 6–7 (4/7)తో నాలుగో సీడ్ కెన్ స్కప్స్కీ–నీల్ స్కప్స్కీ (బ్రిటన్) జంట చేతిలో పరాజయం పాలైంది.
70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో విష్ణు జోడీ ఆరు ఏస్లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్లు చేసింది. తొలి సెట్లో ఒకసారి సర్వీస్ చేజార్చుకున్న భారత జంట రెండో సెట్ను టైబ్రేక్లో కోల్పోయింది. క్వార్టర్స్లో ఓడిన విష్ణు–బాలాజీ జంటకు 1,630 పౌండ్ల (రూ. లక్షా 47 వేలు) ప్రైజ్మనీతోపాటు 20 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
#
Tags