Watch Live: కళ్యాణదుర్గంలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
ఆ ఇద్దరు క్రికెటర్లకు వార్నింగ్!
Published on Tue, 02/16/2016 - 19:24
కరాచీ: వాహబ్ రియాజ్, షెహ్జాద్ అహ్మద్.. ఇద్దరూ పాకిస్తాన్ క్రికెటర్లే. ఇటీవల క్వెట్టా గ్లాడియేటర్స్, పెషావర్ జల్మీ జట్ల మధ్య పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) మ్యాచ్ జరుగుతుంది. ఆ క్రమంలో మ్యాచ్ ఐదో ఓవర్లో రియాజ్, షెహజాద్ల మధ్య మాటల యుద్దం చోటు చేసుకుంది. ఇది ఎంతవరకూ వెళ్లిందంటే ఆ ఇద్దరూ ఒకరినొకరూ తోసుకుంటూ పరుష పదజాలంతో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు. తమ స్థాయిని కూడా మరిచి జగడానికి సిద్ధమయ్యారు.
దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇద్దరు ఆటగాళ్లు ఇలా శారీరక దాడికి పాల్పడటం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని పీసీబీ అధికారి ఒకరు తెలిపారు. పీఎస్ఎల్ ను యావత్తు ప్రపంచం చూసే క్రమంలో దాడి అనేది పాకిస్తాన్ క్రికెట్ కు అవమానకరమన్నారు. దీన్ని ఏమాత్రం తేలికగా తీసుకోలేదన్నారు. ఇప్పటికే ఆ ఇద్దరు ఆటగాళ్లను పిలిచి వార్నింగ్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కాగా, రియాజ్కు ఫీజులో 40 శాతం, షెహజాద్ కు 30 శాతం జరిమానాను మ్యాచ్ రిఫరీ రోషన్ మహనామా విధించారు.
Tags