amp pages | Sakshi

టెస్టు చరిత్రలో స్పెషల్‌ రికార్డు

Published on Fri, 05/26/2017 - 12:11

హైదరాబాద్‌: టెస్టు మ్యాచ్ ఒక ఇన్నింగ్స్ లో నలుగురు సెంచరీలు చేయడమే అరుదు. అటువంటిది వరుసగా నలుగురు ఆటగాళ్ల శతకాలతో ప్రత్యర్థిపై ముప్పేట దాడి చేస్తే ఎలా ఉంటుంది. 2007లో మే 25 నుంచి 27వ తేదీ వరకూ బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టు మ్యాచ్లో భారత క్రికెట్ జట్టు వరుస నాలుగు సెంచరీల నమోదు చేసి తొలిసారి కొత్త చరిత్ర సృష్టించింది. దాదాపు 10 ఏళ్ల క్రితం భారత జట్టు రికార్డును నమోదు చేసిన సందర్భంగా ఆ మ్యాచ్ను మరొకసారి జ్ఞప్తికి తెచ్చుకుందాం.  బంగ్లాదేశ్‌లోని మిర్పూర్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌ లో ఓపెనర్లు దినేష్‌ కార్తీక్‌(129), వసీం జాఫర్‌(138) శతకాలతో మెరవగా, ఆ పై వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ ద్రావిడ్‌(129) సెకండ్ డౌన్‌ బ్యాట్స్‌మన్‌ సచిన్‌(122)లు సెంచరీలతో చెలరేగిపోయారు.
 
ఈ మ్యాచ్‌ లో మరో విశేషమేమిటంటే... 175 పరుగుల వద్ద కార్తీక్‌ గాయంతో రిటైర్డ్‌ అవుట్‌గా మైదానం వీడగా క్రీజులో ఉన్న జాఫర్‌ ద్రావిడ్‌తో ఆడుతూ సెంచరీ సాధించాడు. అనంతరం కొద్దిసేపటికి జాఫర్‌ కూడా గాయంతో రిటైర్ట్‌ అవుట్‌గా పెవిలియన్‌ చేరాడు. దీంతో భారత్‌ వికెట్‌ కోల్పోకుండా 281 పరుగులు చేసింది. తర్వాత సచిన్‌, ద్రావిడ్‌లు సెంచరీలతో కదం తొక్కడంతో భారత్‌ తొలివికెట్‌ కు 408 పరుగులు చేసింది.
 
ద్రావిడ్‌ అవుటవ్వడంతో వినూమన్కడ్‌-పంకజ్‌ రాయ్‌ పేరిట ఉన్న 413 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్య రికార్డును 5 పరుగుల దూరంలో చేజార్చుకుంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కార్తీక్‌ సెంచరీ చేయడంతో నలుగురు ఆటగాళ్లు సెంచరీలు చేసిన రికార్డు నమోదు అయింది. ఈమ్యాచ్‌ లో భారత్‌ ఇన్నింగ్స్‌, 239 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. టెస్టుల్లో ఇషాంత్‌ శర్మకు తొలి మ్యాచ్‌ కావడం మరో విశేషం.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)