ఏపీ సీఎస్, డీజీపీని ఢిల్లీకి పిలిచిన ఈసీఐ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు జరిమానా
Published on Sat, 03/26/2016 - 14:42
టి-20 ప్రపంచ కప్లో భారత్తో జరిగిన ఉత్కంఠ పోరులో విజయం ముంగిట ఓడిపోయిన బంగ్లాదేశ్ జట్టుకు మ్యాచ్ ఫీజులో కోతపడింది. స్లో ఓవర్ రేట్తో బౌలింగ్ చేసినందుకు బంగ్లా కెప్టెన్ మోర్తజాకు మ్యాచ్ ఫీజులో 20 శాతం, ఇతర ఆటగాళ్లకు 10 శాతం చొప్పున జరిమానా విధించారు.
బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో నిర్ణీత సమయానికి బంగ్లా బౌలర్లు ఓ ఓవర్ తక్కువ వేశారు. దీంతో మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ బంగ్లా జట్టుకు జరిమానా వేశారు. చిరస్మరణీయమైన ఈ మ్యాచ్లో ఓడిపోతుందని భావించిన టీమిండియా పరుగు తేడాతో ఉత్కంఠ విజయం సాధించిన సంగతి తెలిసిందే. చివరి మూడు బంతుల్లో బంగ్లా విజయానికి రెండు పరుగులు అవసరం కాగా.. పరుగు కూడా చేయకుండా వరుసగా మూడు వికెట్లు కోల్పోయింది.
#
Tags