amp pages | Sakshi

పట్టాలు తప్పిన ‘అమరావతి’

Published on Thu, 10/30/2014 - 22:49

సాక్షి, ముంబై: అమరావతి నుంచి ముంబై వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు గురువారం ఉదయం 4.50 గంటల ప్రాంతంలో కల్యాణ్ స్టేషన్‌లో పట్టాలు తప్పింది. ఆ సమయంలో రైలు వేగం చాలా తక్కువగా ఉండటం వల్ల ప్రయాణికులెవరూ గాయపడలేదని రీజినల్ అధికారి అరుణేంద్ర కుమార్ చెప్పారు.

ఈ ఘటన లోకల్‌తోపాటు దూరప్రాంతాల ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపిందని ఆయన అన్నారు. కల్యాణ్ స్టేషన్‌లో నాలుగో నంబర్ ప్లాట్‌ఫారంపై రైలు వస్తుండగా ఇంజిన్, వెనకాలే ఉన్న ఓ బోగీ పట్టాలు తప్పినట్లు కుమార్ చెప్పారు. ఈ ఘటన కారణంగా కొన్ని రైళ్లను దారి మళ్లించగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేయాల్సి వచ్చింది. సమాచారం అందుకున్న సాంకేతిక సిబ్బంది ఇంజిన్, బోగీని పట్టాలు ఎక్కించే పనులు ప్రారంభించారు.

ప్రయాణికుల ఇబ్బందులు...
అమరాతి-ముంబై ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం కారణంగా వెనకాలే వస్తున్న పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ముఖ్యంగా సికింద్రాబాద్-ముంబై సీఎస్టీ మధ్య నడిచే దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో వస్తున్న తెలుగు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఠాణే స్టేషన్‌కు ఉదయం అరున్నరకు రావాల్సిన దేవగిరి ఎక్స్‌ప్రెస్ 10 గంటల తర్వాత చేరుకుందని ప్రయాణికులు కొల్లూరి మహేశ్, ఉషారాణి న్యూస్‌లైన్‌కు చెప్పారు. ఇదిలాఉండగా, మన్మాడ్-ముంబై-మన్మాడ్ పంచవటి ఎక్స్‌ప్రెస్, మన్మాడ్-కుర్టా టర్మినస్-మన్మాడ్ గోదావరి ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేయగా, భుసావల్-పుణే ఎక్స్‌ప్రెస్‌ను మన్మాడ్-దౌండ్ మీదుగా దారి మళ్లించారు.
 
లోకల్ రైళ్లపై ప్రభావం
రైలు పట్టాలు తప్పడంతో నాలుగో నంబర్ ప్లాట్‌ఫారం నిరుపయోగంగా మారింది. దీంతో మిగతా ప్లాట్‌ఫారాలపై అదనపు భారం పడింది. దీని ప్రభావం లోకల్ రైళ్లపై కూడా పడింది. పలు లోకల్ రైళ్లు ఆలస్యంగా నడిచాయి. దీనివల్ల ఉదయం ఆసన్‌గావ్, టిట్వాల తదితర ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగులు, ఇతరులు తమ గమ్యస్థానాలకు ఆలస్యంగా చేరుకున్నారు.

Videos

టీడీపీ సర్పంచ్ కి 11 లక్షల సంక్షేమ పథకాలు...అది సీఎం జగన్ సంస్కారం..

విశాఖపై టీడీపీ కొత్తరాగం

పేదలపై చంద్రబాబు పెత్తందారీ కుట్ర

సముద్రంలో చేపలు పట్టిన KA పాల్

నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి లు చెప్పేవి అన్ని అబద్ధాలే..

బాచుపల్లిలో ఘోర ప్రమాదం

మేము ఎప్పుడో గెలిచాం..మెజారిటీ కోసం చూస్తున్నాం..

నల్లజర్ల ఘటనపై మంత్రి తానేటి వనిత రియాక్షన్

సర్వే పై సంచలన విషయాలు బయటపెట్టిన కెఎస్ ప్రసాద్..

బూతు అస్త్రం ప్రయోగిస్తున్న బాబు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?