ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చిల్లర దాడి
Published on Sat, 08/11/2018 - 11:30
దొడ్డబళ్లాపురం: కేవలం ఆరు రూపాయల చిల్లర కోసం ఒక ప్రయాణికుడు కండక్టర్పై దాడికి పాల్పడిన ఘటన విజయపుర జిల్లా ఇండి తాలూకాలో చోటుచేసుకుంది. సులేమాన్ అనే ప్రయాణికుడు గురువారం తాంబా గ్రామంలో కేఎస్ ఆర్టీసీ బస్సు ఎక్కాడు. చిల్లరలేకపోవడంతో కండక్టర్ ఇన్నూసాబ్ ఉస్మాన్సాబ్ టిక్కెట్ వెనుక రూ.6 చిల్లర రాసి ఇచ్చాడు. బస్సు గమ్యస్థలానికి వచ్చినా కండక్టర్ చిల్లర ఇవ్వలేదన్న కోపంతో సులేమాన్ గొడవపడ్డాడు. చివరకు డిపోకు వెళ్లి చిల్లర డబ్బు తీసుకున్నాడు. శుక్రవారం బస్సు తాంబా గ్రామానికి రాగా సులేమాన్ సదరు కండక్టర్పై ఇనుపరాడ్తో తలపై బాదాడు. దీంతో కండక్టర్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు స్పందించి బాధితుడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
#
Tags