amp pages | Sakshi

రోడ్డు వేస్తేనే మా గ్రామానికి రండి..

Published on Mon, 04/25/2016 - 03:21

అభ్యర్థులకు గ్రామస్తుల హెచ్చరిక

క్రిష్ణగిరి:  వందేళ్లుగా నివశిస్తున్నాం. మా గ్రామానికి రోడ్డు లేదు. కనీస వసతులు కూడా కల్పించలేదు. ప్రతిఎన్నికల్లోనూ అభ్యర్థులు వాగ్దానాలు చేసి ఓట్లు కొల్లగొడుతున్నారు. ఈ సారి ఓట్లు అడిగేందుకు వచ్చే అభ్యర్థులు మా గ్రామాలకు రోడ్డు వేసి లోనికి రావాలని, లేదంటే అడ్డుకుంటాం, నల్లజెండాలు ప్రదర్శిస్తామని  వేపనహళ్లి నియోజకవర్గంలోని చంబరసనపల్లి  పంచాయతీ పెద్దపాపనపల్లి గ్రామస్థులు, అంకొండపల్లి  పంచాయతీ చిన్నపాపనపల్లి, చక్కార్లు గ్రామస్థులు పేర్కొన్నారు. పెద్దపాపనపల్లిలో 30 ఇళ్లు, చక్కార్లులో 100, చిన్నపాపనపల్లిలో 60 ఇళ్లున్నాయి.  వందలాది ఏళ్లుగా ఇక్కడే నివశిస్తున్నామనీ.

తమ గ్రామాలకు రోడ్డు వసతి లేదు, పాఠశాలలు లేవు. తాగునీటి వసతులు లేవని గ్రామస్థులు తెలిపారు. ప్రతిసారి ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేసి వెళ్లుతున్నారేకాని, ఎన్నికల తర్వాత ముఖం చాటేస్తున్నారని గ్రామస్థులు వాపోయారు. ఈ గ్రామాలలో సరైన వైద్యసదుపాయాలు లేక అంగవికలురు ఎక్కువ. చిన్నపాపనపల్లిలో 20 మంది అంగవికలున్నారు. ఈ మాల పిల్లలు ఉన్నత చదువులకై సూళగిరికి ఎనిమిది కిలోమీటర్లదూరం నడచి వెళ్లుతున్నారు. ప్రాథమిక  పాఠశాలలకు వెళ్లాలంటే రెండు కిలోమీటర్ల దూరం నడచి వెళ్లవలసి వస్తుందని గ్రామస్థులు తెలిపారు. చిన్నారు నదికడ్డంగా వంతెన నిర్మాణం కోసం ఎన్నోసార్లు ప్రయత్నించినా ఫలితంలేదన్నారు.

ఈ గ్రామాల్లో చిరుత, ఏనుగుల భయం ఎక్కువ. అటవీ శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. ఎమ్మెల్యే, ఎంపీలు, స్థానిక ప్రజాప్రతినిధులకు ఓటు గొడవ తప్పా తమ గోడు  పట్టించుకోవడంలేదని స్థానికులంటున్నారు. ఈ ఎన్నికలలో మాత్రం ఎవరినీ వదిలేదిలేదని హెచ్చరించారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)