amp pages | Sakshi

గరిష్ట వేగం 25 కి.మీ. లోపే

Published on Tue, 09/16/2014 - 22:56

 న్యూఢిల్లీ: ఈ-రిక్షాలపై రోడ్డు రవాణా, హైవేస్ మంత్రిత్వ శాఖ ఆంక్షలను విధించనుంది. ఈ శాఖ మంగళవారం జారీచేసిన ముసాయిదా నోటిఫికేషన్ ప్రకారం నగరంలో ఇకమీదట 25 కిలోమీటర్ల వేగానికి మించి నడపకూడదు. అంతేకాకుండా వాటిల్లో నలుగురు ప్రయాణికులను మించి ఎక్కించుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ లెసైన్సు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణికుల భద్రత కు ముప్పని, అంతేకాకుండా నగరంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని పేర్కొంటూ ఢిల్లీ హైకోర్టు ఈ ఏడాది జూలై 31వ తేదీన వీటి సంచారంపై నిషేధం విధించిన సంగతి విదితమే.
 
 రోడ్డు రవాణా, హైవేస్ మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్ ప్రకారం  ఈ-రిక్షాలకు ఫిట్నెస్ పత్రాలు తప్పనిసరి. కేంద్ర మోటారు వాహనాల చట్టం, 1989లో సవరణలను చేపట్టేందుకుగాను పదిరోజుల్లోగా ఈ ముసాయిదా నోటిఫికేషన్‌పై స్పందించాల్సిందిగా ఈ-రిక్షా చోదకులను కోరింది. తమ తమ అభ్యంతరాలు లేదా సలహాలు, సూచనలను రవాణా శాఖ కార్యదర్శికి పంపాల్సి ఉంటుందని సదరు నోటిఫికేషన్ పేర్కొంది. 1988నాటి మోటారు వాహనాల చట్టాన్ని సవరించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని తెలిపింది. వీటి గరిష్ట వేగం 25 కిలోమీటర్లకు మించకూడదని, అంతేకాకుండా దీని మోటార్ విద్యుత్ సామర్థ్యం 200 వాట్లను దాటకూడదంది. డ్రైవర్‌ను మినహాయించి నలుగురికి మించి ప్రయాణికులను అందులో తీసుకెళ్లకూడదంది. ఇక లగేజీ 40 కిలోలను మించకూడదంది. డ్రైవింగ్ లెసైన్సు కాలపరిమితి జారీ అయిన తర్వాత నాటి నుంచి మూడు సంవత్సరాలు ఉంటుందని, ఆ తర్వాత దానిని రెన్యువల్ చేసుకోకూడదని తెలిపింది. పరీక్షల తరువాతే వీటికి ఫిట్‌నెస్ పత్రాలను జారీచేస్తారు.
 
 నిర్దేశిత మార్గాల్లోనే వీటిని నడపాల్సి ఉంటుంది. బ్యాటరీ ఆధారిత వాహనమని, ఇది మూడు చక్రాలపై నడుస్తుందంటూ ఈ-రిక్షాను ఈ నోటిఫికేషన్ అభివర్ణించింది. ప్రయాణికుడిని గమ్యస్థానం వరకూ చేర్చే వాహనమని పేర్కొంది. లైట్లు, వీల్ రిమ్ములు, బ్యాటరీ తదితరాలకు సంబంధించి వీటి యజమానులు ఎట్టిపరిస్థితుల్లోనూ కొన్ని ప్రమాణాలను పాటించాల్సి ఉంటుందంది.కాగా ఈ-రిక్షాలకు సంబంధించి పదిరోజుల్లోగా ఓ నోటిఫికేషన్‌ను జారీచేస్తామంటూ రోడ్డు రవాణా, హైవేస్ శాఖ మంత్రిత్వ నితిన్ గడ్కరీ సోమవారం ప్రకటించిన సంగతి విదితమే. అంతేకాకుండా ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు శాయశక్తులా కృషి చేస్తామని కూడా అన్నారు. వీటిపై నిషే ధం కారణంగా వీటిపై ఆధారపడి బతుకుతున్న కుటుంబాలు వీధులపాలయ్యాయన్నారు.
 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)