amp pages | Sakshi

అకాల వర్షాలతో కుదేలైన రైతులు

Published on Sun, 04/26/2015 - 02:55

- పరిహారం అందివ్వాలని రాస్తారోకో
సింధనూరు టౌన్ : గత వారం కురిసిన అకాల వర్షాల నుంచి ఇంకా కోలుకోని రైతులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వరిపంట తీవ్రంగా నష్టపోవడంతో రైతులు ఆకస్మిక రాస్తారోకో చేపట్టారు. తాలూకాలోని బసాపుర ఈజే, పగడదిన్ని క్యాంప్, కున్నటగి, దేవరగుడి, గీతాక్యాంప్, తుర్విహాళ, గుంజళ్లి తదితర గ్రామాల్లో వరి పంటలకు తీవ్ర నష్టం జరిగింది. ఏపుగా పెరిగిన వరి పంట కోతకు వచ్చే దశలో అకాల వర్షాలు ముంచెత్తాయి. దిక్కుతోచని రైతులు నానిపోయిన వరి పణలను ట్రాక్టర్లలో వేసుకొని వచ్చి తాలూకాలోని బసాపుర క్యాంప్ వద్ద రాస్తారోకో చేపట్టారు.

ప్రభుత్వ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జెడ్పీ మాజీ అధ్యక్షుడు బాదర్లి పంపనగౌడ, జెడ్పీ సభ్యుడు చందూసాబ్ ముళ్లూరు తదితరులు అక్కడకు చేరుకుని రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అనంతరం అక్కడకు చేరుకున్న జిల్లాధికారి శశికాంత్ సెంథిల్, తహశీల్దార్ గంగప్ప కల్లూరులను రైతులు చుట్టుముట్టారు. రైతుల సమస్యలు పరిష్కరిస్తామని అధికారులు హామీనివ్వడంతో రైతులు శాంతించి తమ ఆందోళన విరమించారు. అనంతరం రైతులు, నాయకులతో అధికారులు చర్చించారు. ప్రముఖులు మల్లనగౌడ కన్నారి, శ్రీనివాస్, పంపనగౌడ పూలబావి, ఎస్‌ఎన్ రాజు, సహాయక వ్యవసాయ అధికారి జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. రైతుల రాస్తారోకోతో సుమారు గంటసేపటికి పైగా ట్రాఫిక్ అస్తవ్యస్తమైంది.  

మూడు రోజుల్లో ప్రభుత్వానికి పంట నష్టంపై నివేదిక
అకాల వర్షంతో జరిగిన పంట నష్టంపై రైతులకు తగిన పరిహారం అందించేందుకు  మూడు రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక పంపుతామని జిల్లాధికారి శశికాంత్ సెంథిల్ పేర్కొన్నారు. కౌలు రైతులకు కూడా పరిహారం అందింపజేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఆయన శుక్రవారం తాలూకాలోని బసాపుర క్యాంప్ వద్ద నష్టానికి గురైన వరి పంటను పరిశీలించిన అనంతరం మాట్లాడారు. తహశీల్దార్ నేతృత్వంలో తాలూకాలో జరిగిన పంట నష్టంపై సర్వే జరిపించి నివేదిక రూపొందిస్తామన్నారు. గతంలో మాదిరిగా చెక్‌ల రూపంలోనే ఈసారి కూడా పరిహారం అందిస్తామన్నారు. అందువల్ల ప్రతిఒక్క రైతు బ్యాంకు ఖాతా కలిగి ఉండాలన్నారు.

సింధనూరు టౌన్ : తాలూకాలో గురువారం రాత్రి కురిసిన వడగండ్ల   వర్షాలకు వరి పంటలు నీటి పాలయ్యాయి. గొరెబాళ్, సాసలమరి, సోమలాపుర గ్రామాల్లో కురిసిన వర్షం వల్ల కోత దశలో ఉన్న వరి పంట నేలకొరిగి భారీ స్థాయిలో నష్టం వాటిల్లింది. ప్రభుత్వం స్పందించి పంటల నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.  

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)