amp pages | Sakshi

కాంగ్రెస్‌పై మోడీ నిప్పులు

Published on Sat, 03/01/2014 - 01:44

  • కాంగ్రెస్‌పై మోడీ నిప్పులు
  •  అవినీతికి ఆ పార్టీ మారుపేరు
  •  ప్రజల విశ్వసనీయత కోల్పోయింది
  •  ఓటు బ్యాంక్ రాజకీయాలు నమ్మొద్దు
  •  దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌కు వ్యతిరేక తుపాను
  •  త్వరలో అది సునామీగా మారనుంది
  •  ఆంధ్రప్రదేశ్‌లో ఆందోళనలు.. ఢిల్లీలో కాంగ్రెస్ నేతల జల్సాలు
  •  సాక్షి ప్రతినిధి, బెంగళూరు : దురహంకారానికి పర్యాయ పదంగా మారిన కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయత కోల్పోయిందని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ విమర్శించారు. గుల్బర్గ, హుబ్లీలలో శుక్రవారం జరిగిన పార్టీ బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడే కాంగ్రెస్‌ను ఎప్పుడూ నమ్మవద్దని కోరారు. అవినీతి, కుటుంబ రాజకీయాలకు ఆ పార్టీ చిరునామాగా మారిందని దుయ్యబట్టారు. అలాంటి పార్టీని వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మట్టి కరిపించాలని ప్రజలను కోరారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ వ్యతిరేక తుపాను బలపడుతోందని, క్రమంగా ఇది ఎన్నికల నాటికి సునామీ రూపం దాల్చుతుందని అన్నారు.

    ఎన్నికల తేదీలు ప్రకటిస్తే కాంగ్రెస్‌పై ఉన్న ప్రజా వ్యతిరేకత ప్రభంజనంలా మారడం ఖాయమని, ఆ ప్రభంజనంలో కాంగ్రెస్ చిరునామా లేకుండా కొట్టుకు పోతుందని జోస్యం చెప్పారు. స్వయృంకతాపరాధం వల్లే ఆ పార్టీ అంతర్థానమవుతుందన్నారు. తమ ఈతి బాధలన్నిటికీ కాంగ్రెస్ కారణమని దేశ ప్రజలు ఎప్పుడో గుర్తించారని తెలిపా రు. పేద, యువత, రైతుల ప్రధాన ధ్యేయం కూడా కాంగ్రెస్ పతనమేనని పేర్కొన్నారు. న్యాయ కోవిదుడు ఫాలి నారిమన్ లోక్‌పాల్ అన్వేషణ కమిటీలో చేరడానికి విముఖత వ్యక్తం చేయడాన్ని ప్రస్తావిస్తూ, ఆ పార్టీ అవినీతి రాజకీయాలకు ఇది తాజా తార్కాణమని అన్నారు.

    తెలంగాణ విభజనను ప్రస్తావిస్తూ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ఆందోళనలు చేస్తుంటే, ఢిల్లీలో ఆ పార్టీ వారంతా జల్సాల్లో మునిగి తేలారని విమర్శించారు. సీమాంధ్రలో నూకలు చెల్లాయని గ్రహించే ఆ ప్రాంతానికి కాంగ్రెస్ తీరని ద్రోహం చేసిందని దుయ్యబట్టారు. దేశాన్ని, రాష్ట్రాలను, ఆఖరుకు ప్రజృ హదయాలను కూడా కాంగ్రెస్ ముక్కలు చేసిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హామీలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని ప్రజలను కోరారు. అధికారంలోకి వచ్చే ముందు ద్రవ్యోల్బణాన్ని వంద రోజుల్లో అదుపు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ హామీని నిలబెట్టుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. సభల్లో పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడు ఎం. వెంకయ్య నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి అనంత కుమార్, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తదితరులు పాల్గొన్నారు. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)