amp pages | Sakshi

కేన్సర్‌ను తరిమేయడంలో ముందుంటా

Published on Thu, 02/20/2014 - 23:00

   రోగులకు సరైన చికిత్స అందడంలో నావంతు సహాయసహకారాలందిస్తా
     సహచారీ ఫౌండేషన్ సంస్థ కోసం నిధులు సేకరిస్తా: మనీషా కొయిరాల
 
 న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి మనీషా కొయిరాల కేన్సర్ బాధితులకు తనవంతు సహాయసహకారాలందించనుంది. కేన్సర్‌ను తరిమేయడంలో అందరికంటే ముందుంటానని స్వయంగా కేన్సర్ బాధితురాలైన మనీషా పేర్కొంది. ఇందుకోసం సహచారీ ఫౌండేషన్ సంస్థ కోసం నిధులు సేకరిస్తానని చెప్పింది. ‘కేన్సర్ వ్యాధిబాధితుల చికిత్స కోసం ఏం చేయడానికైనా నేను ముందుంటా. ఈ పనిచేసే అవకాశం వస్తే గర్వంగా ఫీలవుతా. ఎందుకంటే కేన్సర్ వల్ల కలిగే బాధ ఏంటో నేను స్వయంగా అనుభవించాను. అందుకే బాధితులకు అండగా నిలవాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. ఈ వ్యాధి సోకినవారు దాని నుంచి బయటపడాలంటే చికిత్స ప్రక్రియ సక్రమంగా జరగడమే ముఖ్యం. అందుకోసం నావంతు సహాయసహకారాలందిస్తా’నని గురువారం నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పింది.
 
  రొమ్ము కేన్సర్ సోకిన మహిళల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన జాకెట్లను సహచారీ ఫౌండేషన్ సంస్థ తరఫున టాటా మెమోరియల్ ఆస్పత్రిలోని మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మనీషా  మాట్లాడుతూ... ‘ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ జాకెట్లు మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని  నింపుతాయని భావిస్తున్నా. కేన్సర్‌తో పోరాడేందుకు, దాని నుంచి బయటపడేందుకు ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయనే నమ్మకం నాకుంది. సహచారీ ఫౌండేషన్ ప్రతినిధులు ఈ విషయమై నన్ను సంప్రదించారు. తమ సంస్థ చేస్తున్న ఈ మంచిపనికి సహాయసహకారాలు అందించాల్సిందిగా కోరారు. నేను వెంటనే అంగీకరించాను. కేన్సర్ నుంచి బయటపడడంలో యోగా కూడా నాకు ఎంతగానో తోడ్పడింద’ని చెప్పింది.
 
  ‘డిజైన్ వన్’ పేరుతో లోధీ హోటల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రముఖ డిజైనర్లను ఒక్కచోటుకు తీసుకొచ్చింది. వారి సహాయంతో కేన్సర్ రోగులకు సాయమందించేందుకు నిధులను సేకరిస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ డిజైనర్లు పంకజ్, నిధి, మయాంక్, శ్రద్ధా, అత్సు సెఖోసె, ఫల్గుని మెహతా, రీనాసింగ్ తదితరులు పాల్గొన్నారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)