నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘మంత్రి ఆంజనేయ క్షమాపణ చెప్పాలి’
Published on Fri, 12/05/2014 - 02:15
దావణగెరె : గోమాతను పూజించేవారు పూజించవచ్చని, తినేవారు తినవచ్చని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి హెచ్.ఆంజనేయ వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పాలని అఖిల భారత హిందూ మహాసభకు చెందిన ప్రణవానంద స్వామీజీ డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రి కేవలం ఒక వర్గాన్ని బుజ్జగించేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబుగా లేదని అన్నారు.
బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మంత్రి భారతీయ పరంపరలో గోమాతకు ఉన్న ప్రాధాన్యత గురించి తెలుసుకుని మాట్లాడాలన్నారు. గోమాత గురించి అవహేళనకరంగా మాట్లాడిన ఆంజనేయను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో మహాసభ పదాధికారులు ప్రశాంత్, కొట్రేష్, రంగస్వామి, కల్లింగప్ప తదితరులు పాల్గొన్నారు.
#
Tags