amp pages | Sakshi

మిర్చి.. మిర్చి.. మిర్చిలాంటి రైతు

Published on Tue, 09/18/2018 - 06:23

దొడ్డబళ్లాపురం : హుక్కేరి తాలూకాలో హిరణ్యకేశి, ఘటప్రభా నదులు ప్రవహిస్తున్నా అనేక గ్రామాలకు సాగునీరు అందడంలేదు...ఈ గ్రామాలపైకి రక్షి గ్రామం కూడా ఒకటి. రక్షి గ్రామం హిరణ్యకేశి నదికి కేవలం మూడు కిలోమీటర్ల దూరం ఉంది. అయితే ఈ నది వర్షా కాలంలో మాత్రమే ప్రవహిస్తుంది కాబట్టి ఈ ప్రాంతాల రైతులు సాధారణంగానే కూరగాయలు పండించడానికి సాహసించరు. అయితే రైతు నాగరాజు హుండేకార మాత్రం సాహసించారు. పచ్చి మిరప పండిస్తూ మిగతా రైతులకు ఆదర్శంగా నిలిచారు. నాగరాజుకు మొత్తం 5 ఎకరాల భూమి ఉంది. కానీ ఎత్తైన ప్రదేశంలో ఉంది. అందులో నాలుగు ఎకరాల్లో సోనల్‌ అనే రకం మిరపకాయలు సాగు చేస్తున్నాడు. మిగతా ఎకరా భూమిలో గ్రీన్‌హౌస్‌ నిర్మించి పలు రకాల కూరగాయలు పండిస్తున్నాడు. కూరగాయలు పండించడం కోసమే రైతు నాగరాజు తన భూమిలో బోర్‌వెల్‌ తవ్వించాడు. అయితే నీరు పడలేదు. డబ్బులు మాత్రం ఖర్చయ్యాయి. అయినా ఆత్మస్థైర్యంతో దూరంగా తగ్గు ప్రదేశంలో కాస్త భూమి తీసుకుని బోర్‌వెల్‌ వేయించాడు. అక్కడ నీరు పడడంతో అక్కడి నుండి పైపు లైను ద్వారా పంటకు నీరు కడుతున్నాడు.

పంట వేయడానికి ముందు
మిరపకాయ మొక్కలు నాట్లకు ముందు నాలుగు ఎకరాలకు గాను 10 టన్నుల కొట్టం ఎరువు, మూడు లారీల బూడిద ఎరువు వేయించాడు.  మట్టిలో ఎరువులు బాగా కలిసేలా భూమిని దున్ని, తరువాత ఫాస్పెట్‌ రీచ్, ఆర్గానిక్‌ మెన్యూర్‌ (ఎకరాకు 500 కేజీలు), 40కేజీల సల్ఫ ర్, 60కేజీల వేపపిండి,సూక్ష్మ పోషకాంశాలు గల ఎరువు, వినికామ్‌ (ఎకరాకు 2 కేజీలు) మట్టిలో కలపడం జరిగింది. మొక్కలునాటాక అమోనియం సల్ఫేట్‌ చల్లడం జరిగింది. మొక్కలు పెరిగే కొద్దీ నిత్యం డ్రిప్‌ ద్వారా నీటితో ఎరువు అందించాడు. గత 4 నెలలుగా మిరప పంట కోత కోయిస్తున్నాడు. మొదట కేజీకి రూ.15 నుండి రూ.20 మాత్రమే లభించేది.

అయితే ఇప్పుడు రూ.30ల వరకూ ధర పలుకుతోంది. ఇప్పటి వరకూ మొత్తం రూ.5 లక్షలు ఖర్చుకాగా 80 టన్నుల మిరప పంట దిగుబడి వచ్చింది. రూ.20 లక్షల దాకా ఆదాయం వచ్చిందిట. ఇంకా 20 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందంటున్నాడు నాగరాజు. పంట బాగా పండటంతో వ్యాపారులు తోట వద్దకే వచ్చి ఖరీదు చేస్తున్నారని రైతు సంతోషం వ్యక్తం చేశాడు. 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)