రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఇందిరాగాంధీకి ఘన నివాళి
Published on Fri, 11/01/2013 - 02:29
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్కరించుని డీపీసీసీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో డీపీసీసీ అధ్యక్షుడు జయప్రకాశ్ అగర్వాల్ పాల్గొన్నారు. ఇందిరాగాంధీ చిత్రపటానికి పుష్పాలంజలి ఘటించారు. భారతదేశ రాజకీయాలతోపాటు ప్రపంచ రాజకీయ చరిత్రలోనూ ఇందిరాగాంధీకి ఎంతో పేరుందని ఆయన పేర్కొన్నారు. భారతదేశాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లేందుకు ఎన్నో పథకాలను రూపొందించారని కొనియాడారు.
పేదరికాన్ని రూపుమాపేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికీ గుర్తుండే నాయకుల జాబితాలో ఇందిరాగాంధీకి శాశ్వతంగా స్థానం ఉంటుందన్నారు. ఆధునిక భారతదేశ నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన నాయకురాలు అన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లోనూ మన దేశం ఉన్నత స్థానంలో ఉండాలని ఆమె కోరుకుందన్నారు. కార్యక్రమంలో ప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు ఎస్కే.పురీ, సురేశ్మాలిక్, రాజేంద్ర మాలిక్, సుదేశ్ తదితరులు పాల్గొన్నారు.
#
Tags