amp pages | Sakshi

రోడ్ల అభివృద్ధి కోసం రూ.2500 కోట్లు

Published on Sat, 01/18/2014 - 06:19

సింధనూరు టౌన్/గంగావతి,  న్యూస్‌లైన్ : రాష్ట్రంలో అధ్వాన్న స్థితిలో ఉన్న 5 వేల కి.మీ  రోడ్లను రూ.2500 కోట్లతో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ప్రజాపనుల శాఖా మంత్రి హెచ్‌సీ మహదేవప్ప తెలిపారు. సింధనూరులోని ఆదర్శ కాలనీలో ఎస్‌ఎఫ్‌సీ పథకం కింద రూ.3 కోట్లతో చేపట్టిన రోడ్లు, డ్రెయినేజీ పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు.

 ఇప్పటికే రాయచూరు జిల్లాకు రూ.200 కోట్లు అధిక నిధులు కేటాయించినట్లు తెలిపారు.  సింధనూరు అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి యూజీడీ పథకం కోసం రూ. 50 కోట్లు కేటాయించారన్నారు. విశ్వ బ్యాంక్ పథకం కింద  రూ.5 వేల కోట్లతో తాగునీటి సౌకర్యం కల్పించామన్నారు. రాష్ట్రంలో నీటిపారుదల పథకాలకు రూ.10 వేల కోట్లు కేటాయించారని, వీటితో వ్యవసాయ రంగానికి చేయూత నిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో  ఎమ్మెల్యేలు హంపనగౌడ బాదర్లి, ప్రతాప్‌గౌడ పాటిల్, జిల్లా పంచాయతీ అధ్యక్షులు లలితమ్మ, నగరసభ అధ్యక్షులు సయ్యద్ జాఫర్ తదితరులు పాల్గొన్నారు.


 అనంతరం గంగావతిలోని సర్య్కూట్ హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ...  రాష్ట్రంలో కేఆర్‌డీసీ ద్వారా ఈ ఏడాది 1324 కి.మీ నిర్మాణాలు చేపడుతున్నట్లు వివరించారు. అలాగే కేఆర్‌డీసీ ద్వారా ఏడాదికి 200 వంతెనల నిర్మాణాలను చేపట్టే ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. ఆనెగొంది వంతెనను కడెబాగిలు వద్దనే నిర్మిస్తామని, ఇందుకోసం రూ.32 కోట్లు కేటాయించామన్నారు.

ఫిబ్రవరి నుంచి వంతెన పనులు ప్రారంభిస్తామని చెప్పారు.   అంతకు ముందు మం త్రిని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు హెచ్‌ఎస్. భరత్, నేతలు జోగద హనుమంతప్ప నాయక్,  చిలుకూరి విజయలక్ష్మి రామకృష్ణ, కుంటోజి మరియప్ప, బొజ్జప్ప, రుద్రేశ్, కొల్లి గంగాధర్ మంత్రికి పూలమాలలు వేసి స్వాగతం పలికారు.

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?