రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
ఐఎన్ఎస్ అధ్యక్షుడిగా సోమేశ్ శర్మ
Published on Fri, 09/30/2016 - 20:17
బెంగళూరు: భారత వార్తాపత్రికల సంఘం(ఐఎన్ఎస్) ప్రెసిడెంట్గా సోమేశ్ శర్మ (రాష్ట్రదూత్ సప్తాహిక్) ఎన్నికయ్యారు. శుక్రవారం బెంగళూరులో జరిగిన 77వ వార్షిక సమావేశంలో 2016–17కు గాను ఆయనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. డిప్యూటీ ప్రెసిండెంట్గా అల్కా ఉరంకార్(బిజినెస్ స్టాండర్డ్), వైస్ ప్రెసిడెంట్గా కె.బాలాజీ(ది హిందూ) ఎన్నికయ్యారు.
గౌరవ కోశాధికారిగా శరద్ సక్సేనా ( హిందుస్ధాన్ టైమ్స్) ఎన్నికయ్యారు. సొసైటీ సెక్రటరీ జనరల్ గా వి. శంకరన్ వ్యవహరిస్తారు. కార్యవర్గ సభ్యుడిగా ‘సాక్షి’ తెలుగు దినపత్రిక కు చెందిన కె. రాజప్రసాద్ రెడ్డి ఎన్నికయ్యారు. అలాగే సిహెచ్.కిరణ్ ( విపుల,అన్నదాత) కార్యవర్గ సభ్యుడిగా ఎన్నిక అయ్యారు. కాగా ఇప్పటివరకు పీవీ చంద్రన్ (గృహలక్ష్మి–మాతృభూమి గ్రూప్) ఐఎన్ఎస్ అధ్యక్షుడిగా వ్యవహరించారు.
Tags