amp pages | Sakshi

ఆమ్‌ఆద్మీ పార్టీకి రైతు బాసట

Published on Thu, 01/23/2014 - 00:02

కొల్హాపూర్: దక్షిణ మహారాష్ట్రలో ‘సామాన్యుడి’కి రైతు బాసటగా నిలిచాడు. రైతు నాయకుడు రఘునాథ్‌దాదా పాటిల్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరడంతో రాష్ట్రంలో ఆ పార్టీకి సామాన్యులతోపాటు రైతుల మద్దతు కూడా లభించనుంది. ‘షేత్కారీ సంఘటన’ సంస్థ స్థాపన ద్వారా కొల్హాపూర్, సంగ్లీ, సతారా జిల్లాల్లో మంచి పట్టు సంపాదించిన దాదా చేరికతో ఆప్‌కు మరింత ఊపు వచ్చినట్లయిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కాగా, తమ పార్టీలో రఘునాథ్‌దాదా పాటిల్ చేరినట్లు బుధవారం ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు లాంఛనంగా ప్రకటించారు. ఆప్‌లో చేరిన తర్వాత రఘునాథ్ దాదా మీడియాతో మాట్లాడారు.

 ‘గత లోక్ సభ  ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమితో నా సంస్థ కలిసి పనిచేసింది. అయితే రైతు సమస్యలపై వారి ఆలోచ నా విధానం మాకు సంతృప్తినివ్వలేదు.  రైతులు ఎదుర్కొంటున్న ధరల పెరుగుదల, ఇతర సమస్యలపై మా సంస్థ కాంగ్రెస్, ఎన్సీపీ సర్కారుపై బయటనుంచి పోరాటాలు చేస్తుంటే బీజేపీ, శివసేన కూటమి ఏమాత్రం మాకు మద్దతుగా నిలవలేదు. విధాన సభలో రైతు సంబంధ విషయాలపై ఎన్నడూ మాట్లాడలేదు. అందువల్లనే ఆ కూటమిని వీడి నేడు నేను ఆప్‌లో చేరాల్సి వచ్చింది..’ అని దాదా తెలిపారు. ‘రాజుశెట్టి స్వాభిమాని షేట్కారీ సంఘటనతో సంబంధాలు వల్ల బీజేపీ, శివసేన కూటమికి ఒరిగేమీ లేదు.

 నేను రాజకీయాల్లో పోటీ చేయడానికి ఈ పార్టీలో చేరలేదు.. సమస్యలపై పోరాడటానికి ఒక వేదిక దొరుకుతుందని మాత్రమే ఇందులో చేరాను.. అయితే పార్టీ ఆదేశిస్తే హట్కానంగలే స్థానం నుంచి లోక్‌సభకు పోటీచేయడానికి సిద్ధంగా ఉన్నాను..’ అని ఆయన స్పష్టం చేశారు. షేట్కారీ సంఘటన సంస్థకు దక్షణ మహారాష్ట్రలోనే కాక మహారాష్ట్ర మొత్తం రైతుల మద్దతు ఉందని దాదా తెలిపారు.

 ఆప్ కొల్హాపూర్ జిల్లా అధ్యక్షుడు నారాయణ్ పవార్ మాట్లాడుతూ.. దాదా చేరికతో మా పార్టీకి గ్రామీణ స్థాయిలో మరింత పట్టు లభించనట్లయ్యింది. ఆయన పార్టీ అభ్యున్నతి కోసం కార్యకర్తలతో కలిసి చురుకుగా పనిచేస్తారని ఆశిస్తున్నాం..’ అని అన్నారు. ‘మా పార్టీలో చేరడానికి గ్రామీణ ప్రజలు ఉత్సాహం చూపుతున్నారు. ఎటువంటి శిబిరాలు నిర్వహించకుండానే సుమారు ఐదు వేల మంది ఇప్పటికే పార్టీలో చేరారు. వారితో పాటు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, వయోజనులు, యువకులు, విద్యార్థులను సైతం పార్టీలో చేర్చుకుంటున్నాం.

దాదా చేరికతో రైతులు సైతం మా పార్టీని ఆదరిస్తారు..’ అని నారాయణ్ పవార్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఈ విషయమై స్వాభిమాని షేట్కారీ సంఘటన నాయకుడు రాజు శెట్టి మాట్లాడుతూ.. ‘ఆప్‌లో ఎవరు చేరినా మా పార్టీకి ఎటువంటి నష్టం లేదు. దక్షిణ మహారాష్ట్రలో ఉన్న ఇతర రైతు సంఘాలు ఆప్‌తో కలిసినా మాతో పోటీ పడలేర’ంటూ పరోక్షంగా ఆప్‌లో దాదా చేరికపై వ్యాఖ్యానించారు. ‘వారి చర్య వల్ల రైతుల్లో ఎటువంటి విభజన రాదు. వారు మాతోనే ఉంటారు..’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ‘ 2009 లోక్‌సభ ఎన్నికల్లో హట్కానంగలే నియోజకవర్గంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు.

 నేను రఘునాథ్ దాదాపై రికార్డుస్థాయి మెజారిటీతో గెలిచాను. ఈసారీ అదే ఫలితం పునరావృతమవుతుంది..’ అని జోస్యం చెప్పారు. కాగా, గత లోక్‌సభ ఎన్నికల్లో హట్కానంగలే నియోజకవర్గంలో శివసేన తరఫున రఘునాథ్ దాదా పాటిల్ పోటీచేయగా, ఎన్సీపీ తరఫున నివేదిత మానే, స్వాభిమాని షేట్కారీ సంఘటన తరఫున రాజుశెట్టి పోటీపడ్డారు. ఈ ఎన్నికల్లో రాజు శెట్టి 4,81,000 ఓట్లు సాధించి గెలుపొందగా, 3,85,000 వేల ఓట్లతో రెండోస్థానంలో నివేదిత, కేవలం 55 వేల ఓట్లతో దాదా మూడోస్థానంలో నిలిచారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్