amp pages | Sakshi

పార్టీలు మారిన పాత అభ్యర్థులు

Published on Fri, 01/23/2015 - 23:25

నియోజకవర్గ ముఖచిత్రం
మతియామహల్‌లో ముక్కోణమే..
 

న్యూఢిల్లీ: ముస్లిం ఓటర్లు అధికంగా ఉండే మతియామహల్‌లో ఈసారి త్రిముఖ పోటీ తథ్యమనిపిస్తోంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల తరఫున పోటీచేస్తున్న అభ్యర్థులందరూ పాతవారే అయినా వారు పోటీచేస్తున్న పార్టీలు మాత్రం మారిపోవడం గమనార్హం. ఈ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన షోయబ్ ఇక్బాల్ ఈ సారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. గతసారి ఆయన జనతాదళ్ యునెటైడ్ తరఫున పోటీ చేసి గెలిచారు. పార్టీలు మార్చడం షోయబ్ ఇక్బాల్‌కు కొత్తకాదు. గతంలో ఆయన రెండుసార్లు జనతా దళ్ నుంచి, ఒకసారి జేడీ(ఎస్), ఒకసారి ఎల్జేపీ నుంచి, ఒకసారి జేడీయూ నుంచి గెలిచారు. పార్టీలతో నిమిత్తం లేకుండా షోయబ్ ఇక్బాల్‌ను ఎన్నుకుంటున్న మతియామహల్ ఓటర్లు మరోసారి ఆయనను గెలిపిస్తారో లేదో ఫిబ్రవరి 10న తేలనుంది. ఇదిలా ఉండగా, గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన షకీల్ అంజుమ్ దెహల్వీ ఈసారి బీజేపీ టికెట్‌పై పోటీచేస్తున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నిలబెట్టిన ఏకైక ముస్లిం అభ్యర్థి దెహల్వీయే కావడం గమనార్హం.

తాను బీజేపీ తరఫున పోటీచేయడంలో విచిత్రమేమీ లేదని దెహల్వీ అంటున్నారు. తన తండ్రి అన్వర్ దెహల్వీ కూడా జన్‌సంఘ్‌లో ఉండేవారని, ఆయన రెండుసార్లు మెట్రో పాలిటన్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలిచారని ఆయన చెబుతున్నారు. ఆప్ ఈసారి ఆసీమ్‌ఖాన్‌కు టికెట్ ఇచ్చింది. కాగా, దెహల్వీ రంగంలోకి దిగడం వల్ల గతంలో ఎన్నడూ లేని విధంగా మతియా మహల్‌లో ముక్కోణపు పోటీ తథ్యమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మతియా మహల్‌లో ఇంతవరకు బీజేపీ ఎన్నడూ గట్టి పోటీ ఇవ్వలేదు. నిజానికి దాన్ని ఈ నియోజకవర్గంలో బలమైన పార్టీగా పరిగణించలేదు.గత ఎన్నికల్లో బీజేపీకి ఇక్కడ ఆరు వేల ఓట్లు మాత్రమే పడ్డాయి. ఇదిలా ఉండగా, గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి మూడవ స్థానంలో నిలిచిన దెహల్వీ ఈసారి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉండటం వల్ల ఫలితాలలపై దాని ప్రభావం ఉంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నియోజవర్గం ఓటర్లలో 67 శాతం ముస్లింలు కాగా, 31 శాతం హిందువులు,  2 శాతం మంది సిక్కులు ఉన్నారు.
 
 

Videos

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)