పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
Published on Thu, 12/01/2016 - 01:10
టీనగర్ : త్యాగదుర్గం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు మృతిచెందారు. విల్లుపురం జిల్లా త్యాగదుర్గం ప్రాంతానికి చెందిన పాండియన్ కుమారుడు ప్రదీప్కుమార్(24). అదే ప్రాంతానికి చెందిన సుకుమార్ కుమారుడు వినోద్కుమార్(24). ఇరువురూ ఎలక్ట్రీషియన్సగా పనిచేస్తున్నారు. వీరి స్నేహితుడు సేదమంగళం గ్రామానికి చెందిన గణేశన్ కుమారుడు జయమూర్తి(20) ప్రైవేటు కళాశాలలో చదువుతున్నాడు. వినోద్కుమార్ కొత్త బైక్ కొనడంతో విరుగావూరు గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం స్నేహితులకు విందు ఇచ్చాడు. ఇందులో వినోద్కుమార్, ప్రదీప్కుమార్, జయమూర్తితో సహా 10 మంది పాల్గొన్నారు. అనంతరం వారు ఇంటికి తిరిగివస్తుండగా వడపూండి బస్టాండు సమీపంలో బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కనున్న గోడను ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు అక్కడికక్కడే మృతిచెందారు. దీనిగురించి వరంజరం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కల్లకురిచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు.
#
Tags