నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బీజేపీ టీషర్ట్ ధరించి ఉరేసుకున్న రైతు
Published on Mon, 10/14/2019 - 11:37
బుల్దానా (మహారాష్ట్ర): కమలం గుర్తున్న బీజేపీ టీషర్ట్ ధరించి ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో చోటుచేసుకుంది. మృతుడిని రాజు తల్వారే (38)గా గుర్తించారు. ఆదివారం ఉదయం ఖాట్కేడ్ గ్రామంలోని చెట్టుకు అతడు వేలాడుతూ కనిపించాడు. అప్పుల భారం ఎక్కువ కావడంతోనే అతడు బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అతడి టీషర్ట్ మీద ‘ప్రస్తుతమున్న ప్రభుత్వాన్నే తిరిగి ఎన్నుకుందాం’ అన్న వాక్యం ఉంది. ఎన్నికల సందర్భంగా బీజేపీ ఈ టీషర్ట్లను పంచింది. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడే రైతు ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం.
#
Tags