amp pages | Sakshi

12 రోజుల తరువాత మహిళ మృతదేహానికి పోస్ట్‌మార్టం

Published on Fri, 07/17/2015 - 02:53

- అనుమానాలను నివృత్తి చేయండి
 తిరువళ్లూరు : మహిళ మృతిపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భారీ పోలీసు బందోబస్తు నడుమ 12 రోజుల క్రితం మృతి చెందిన మహిళా మృతదేహానికి శవపరీక్ష నిర్వహించారు. చెన్నై సమీపంలోని మణపాక్కం ప్రాంతానికి చెందిన రాజేంద్రన్ కుమార్తె గాయత్రికి తిరువళ్లూరు జిల్లా కొత్తియంబాక్కం గ్రామానికి చెందిన విల్లర్‌కు ఎనిమిదేల్ల క్రితం వివాహం జరిగింది. వీరికి సామువేల్(7), సాల్మన్(5) ఇద్దరు పిల్లలు. విల్లర్ న్యాయవాదినని అబద్దం చెప్పి వివాహం చేసుకున్నట్టు తెలిసింది. విషయం తెలిసి దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవని పోలీసుల విచారణలో తెలిసింది.
 
 ప్రస్తుతం విల్లర్ పూంద మల్లిలోని ప్రయివేటు కంపెనీలో సెక్యూరిటీగా పనిచేస్తూ రాత్రుళ్లు మద్యం సేవించి అదనపు క ట్నం కోసం తరచూ భార్యను వేధించేవాడని గాయత్రీ తల్లిదండ్రులు తెలిపారు. ఈ నేపథ్యంలో గాయత్రి నాలుగవ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఐదున అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల నేపథ్యంలో గాయత్రి మృతదేహం నుంచి రక్తం రావడంతో అనుమానించిన ఆమె కుటుంబసభ్యులు, బంధువులు  మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించాలని వినతి పత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం డీఎస్పీ విజయకుమార్, పూందమల్లి తహశీల్దార్ అభిషేకం పర్యవేక్షణలో వైద్యులు పోస్ట్‌మార్టం నిర్వహించారు. పోస్ట్‌మార్టం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురుకాకుండా పోలీసులు గట్టి బందోబస్తు ర్పాటు చేశారు.

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)