amp pages | Sakshi

ఆ దుర్ఘటన జరిగి 11 ఏళ్లయింది

Published on Wed, 07/31/2019 - 11:03

సాక్షి, కేసముద్రం : దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన గౌతమి ఎక్స్‌ప్రెస్‌ రైలు అగ్ని ప్రమాద ఘటన జరిగి నేటికి పదకొండేళ్లు. ప్రస్తుత మహబూబాబాద్‌ జిల్లాలోని కేసముద్రం – తాళ్లపూసపల్లి రైల్వేస్టేషన్ల మధ్య 2008 జూలై 31న అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సికింద్రాబాద్‌ నుంచి కాకినాడకు డౌన్‌లైన్‌లో వెళ్తున్న గౌతమి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగగా కొద్ది నిమిషాల్లోనే మంటలు దావానంలా వ్యాపించాయి. దీంతో నాలుగుబోగీలు పూర్తిగా కాలిపోగా.. ముప్ఫై మంది ఆ మంటలకు బలయ్యారు. ఈ ఘటన జరిగి 11 ఏళ్లు పూర్తవుతున్నా స్థానికుల మదిలో నుంచి ఆనాటి బాధితుల ఆర్తనాదాలు, మంటలు చెరిగిపోవడం లేదు.

ఉలిక్కిపడిన కేసముద్రం
రైలులోని ప్రయాణికులందరూ నిద్రలో జోగుతున్నారు.. ఇంకా కొన్ని గంటల్లో తమ గమ్యస్థానాలకు చేరుతామనే ధైర్యంతో నిశ్చింతగా నిద్రపోయారు. కానీ వారికి అదే చివరి రాత్రి అయింది. ఇదీ గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో 11 ఏళ్ల క్రితం ప్రయాణించిన వారికి ఎదురైన పరిస్థితి. సికింద్రాబాద్‌ నుంచి  కాకినాడకు బయలుదేరిన గౌతమి ఎక్స్‌ప్రెస్‌ కేసముద్రం – తాళ్లపూసపల్లి స్టేషన్ల మధ్యకు చేరుకుంది. ఇంకా కొద్దిసేపు అయితే  మహబూబాబాద్‌ స్టేషన్‌లో ఆగాల్సి ఉంటుంది.

దీంతో జనరల్‌ బోగీల్లోని పలువురు దిగేందుకు సిద్ధమవుతుండగా బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఒక బోగీ నుంచి మరో బోగీకి మంటలు వ్యాపిస్తూ ఏం జరిగిందో తెలుసుకునే లోగా ఎస్‌9, 10, 11, 12 బోగీలు పూర్తిగా అంటుకున్నాయి. ఏం జరిగిందో తెలుసుకునే లోపే ఆ బోగీల్లో ప్రయాణిస్తున్న 32 మంది అగ్నికి ఆహుతయ్యారు. ఈ ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

గుర్తుపట్టలేనంతగా...
గౌతమి ఎక్స్‌ప్రెస్‌లోని నాలుగు బోగీలు కాలిపోయిన ఘటనలు ఇద్దరు మహిళలు ఊపిరాడక మృతి చెందారు. మరో 30 మంది అగ్నికీలల్లో మాడి మసయ్యారు. డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి కొందరి మృతదేహలను గుర్తించినా... మరో 20 మంది మృతదేహాలను గుర్తించలేకపోయారు. దీంతో ఆ రైలులో ప్రయాణిస్తూ గల్లంతైన వారికోసం వారి కుటుంబ సభ్యులు, బంధువులు రెండేళ్ల పాటు నిరీక్షించారు.

చివరకు బాధితులు మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించడంతో వారి ఆదేశాల మేరకు గుర్తించని గల్లంతైన వారు గౌతమి ఘటనలో మృతి చెందినట్లుగా ఏప్రిల్‌ 2010 అంటే ఘటన జరిగిన తొమ్మిది నెలలకు కేసముద్రం తహసీల్దార్‌ కార్యాలయం నుంచి మరణ ధృ«వీకరణ పత్రాలు జారీ చేశారు. ఈ మేరకు వారి కుటుంబాలకు రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిహారం అందింది. కాగా, ఈ ఘటన జరిగిన రోజు కేసముద్రం మండలం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

ఘటన జరిగిన తెల్లవారుజామున రైల్వే ఉన్నతాధికారులతో పాటు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి, కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి నారాయణ్‌బావ్‌ రత్వా, రైల్వే సేఫ్టీ కమిషన్‌ అధికారులు, రాష్ట్ర పోలీస్‌ ఉన్నతాధికారులు కేసముద్రానికి తరలివచ్చారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి గౌతమి బోగీల్లోకి ఎక్కి పరిశీలించడంతో పాటు బాధితులను ఓదార్చారు.

పది రోజులకు పైగా మృతి చెందిన వారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, బంధువులు ఇక్కడే తిరగడం.. కలిసిన అధికారులకు తమ గోడు వెళ్లబోసుకోవడం వంటి హృదయవిధారక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇక కాలిబూడిదైన బోగీలను చూసేందుకు వచ్చిన చుట్టుపక్కల వారంతా అస్తిపంజరాలు, కళేబరాలను చూసి తట్టుకోలేక పోయారు.

గౌతమి ఘటన జరిగిన పది రోజుల పాటు ఈ ప్రాంత ప్రజలు దిగ్బ్రాంతి నుంచి కోలుకోలేకపోయారు. రైల్వే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండురోజుల పాటు కాజీపేట – విజయవాడ సెక్షన్లలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)