ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్
Breaking News
ఆటాడుతూ అనంతలోకాలకు..
Published on Fri, 07/24/2015 - 17:59
ఖమ్మం: ఇంటి ముందు ఆటలాడుకుంటున్న రెండేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తూ నీటి తొట్టిలో పడి అనంత లోకాలకి వెళ్లిన సంఘటన శుక్రవారం ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. నెల రోజుల కిందట మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు నుంచి ఉపాధి కోసం ఖమ్మం జిల్లాలోని పాల్వంచకు వచ్చిన చంద్రయ్య, నీలమ్మ దంపతులకు ఇద్దరు పిల్లలు.
శుక్రవారం చంద్రయ్య పనికి వెళ్లిన సమయంలో నీలమ్మ ఇంట్లోనే ఉండి మూడు నెలల చిన్న పాప ఆలనను చూసుకుంటోంది. అదే సమయంలో ఇంటి బయట ఆడుకుంటోన్న పావని (రెండేళ్లు) ఆడుకుంటూ వెళ్లి నీటితొట్టిలో పడిపోయింది. కొద్ది సేపటి తర్వాత పాప అలికిడి వినిపించకపోవడంతో అనుమానం వచ్చిన నీలమ్మ బయటికి వచ్చి చూసేవరకు పావని విగతజీవిగా కనిపించింది. బాలింతరాలైన నీలమ్మ పెద్ద కూతురి కోసం గుండెలవిసేలా రొదించడం స్థానికులను కంటతడిపెట్టించింది.
Tags