amp pages | Sakshi

కృష్ణమ్మ పరవళ్లకు 51ఏళ్లు

Published on Sat, 08/04/2018 - 15:33

నాగార్జునసాగర్‌ : తెలుగు రాష్ట్రాల వరప్రదాయిని నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదల చేసి నేటికీ 51ఏళ్లు నిండాయి. కృష్ణానదిపై నిర్మించిన బహుళార్థక సాధక ప్రాజెక్టు నాగార్జునసాగర్‌ మానవ నిర్మిత ఆనకట్టల్లో ప్రపంచంలోనే అతిపెద్దది. 1967ఆగస్టు 4న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేసి, ప్రాజెక్టును జాతికి అంకితం చేసింది. 1955 డిసెంబర్‌ 10న ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ శంకుస్థాపన చేయగా 12 ఏళ్ల తర్వాత ఆయన కుమార్తె ఇందిరాగాంధీ సాగర్‌ ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు.

ఆనాడు రైతుల కళ్లల్లో ఆనందం తొ ణికిస లాడింది. కాల్వల్లో నీరు పారడంతో బీళ్లుగా ఉన్న భూముల్లో రైతులు సిరులు పండిస్తున్నారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో సుమారు 3లక్షలు, కుడి, ఎడమ ఎడమ కాల్వల ద్వారా రూ. 25 లక్షల ఎకరాల భూమి సాగవుతోంది. తాగు, సా గునీటికి కొదువలేకుండా పోయింది. ఆయకట్టు పరిధిలోని మిర్యాలగూడ, కోదాడ, హాలియా, నేరేడుచర్ల, హూజూర్‌నగర్‌ ప్రాంతాలు నేడు ఆరి ్థకంగా అభివృద్ధి పథంలో ఉన్నాయి.

నేటికీ నెరవేరని లక్ష్యం

ఇన్నేళ్లు గడిచినా ప్రాజెక్టు లక్ష్యం నెరవేరలేదు. ప్రాజెక్టు ఆధునికీకరణలో కొన్ని ప్రాంతాలకు నీరు చేరువైనప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లోని కాల్వ చివరి భూములకు నేటికీ నీరందడం లేదు. ప్రాజెక్టుకు కూతవేటు దూరంలో ఉన్న భూములు బీడు భూములుగానే ఉంటున్నాయి. ప్రాజెక్టు నిర్మాణానికి ఆనాటి అంచనా వ్యయం కేవలం రూ.70కోట్లు కాగా ఆ తర్వాత మరమ్మతులకే వేల కోట్ల రూపాయలు వ్యయం చేశారు.

ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందకపోవడంతో నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రాజెక్టు ఆధునికీకరణకు శ్రీకారం చుట్టారు. ప్రపంచబ్యాంకు ఆర్థికసాయంతో రూ.4,444.44కోట్లతో ప్రణాళిక తయారుచేసి పనులను ప్రారంభిం చారు. 2016లో పనులు పూర్తి చేశారు. ఆధునికీకరణతో పూర్తిస్థాయిలో నీరుసాగర్‌ ప్రాజెక్టు ఆధునికీకరణతో గ్యాప్‌ ఆయకట్టు లక్ష ఎకరాలకు సాగు నీరందడంతో పాటు మరికొంత భూమి టేలాండ్‌గా మారకుండా ఉంది. కాల్వల్లో నీటి ప్రవాహం పెరిగి అనుకున్న సమయానికి పొలాల్లోకి నీరు చేరుతోంది. ఆఫ్‌ ఆన్‌ పద్ధతిలో నీరిచ్చి రైతులకు అదనపు దిగుబడి వచ్చేలా చేశాం.  

- సునీల్, ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్‌

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)