వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఒక నాయకుడికి పొంచి ఉన్న ప్రమాదం
Published on Wed, 03/29/2017 - 12:19
తెలంగాణలో ఉగ్రవాద, తీవ్రవాద చర్యలు పెరిగే అవకాశం ఉందని, ఒక నాయకుడికి కూడా ప్రమాదం పొంచి ఉందని పంచాంగకర్త సంతోష్ కుమార్ శాస్త్రి చెప్పారు. హేవళంబి నామ సంవత్సర ఉగాది సందర్భంగా ప్రగతిభవన్లో ఆయన పంచాంగ శ్రవణం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, పలువురు మంత్రులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఈ ఏడాది రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తాయని, ఆషాడంలో తుపానులు కూడా వస్తాయని సంతోష్ కుమార్ శాస్త్రి చెప్పారు. రాష్ట్రంలో పరిపాలన బాగుంటుందని, అయితే పోలీసు శాఖ మాత్రం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు మేలు జరుగుతుందని, రైతులు సుభిక్షంగా ఉంటారని అన్నారు.
#
Tags