amp pages | Sakshi

ఆధార్‌ ఉంటేనే ఎరువు!

Published on Tue, 12/05/2017 - 03:25

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని రైతులు ఇకపై ఎరువులు కొనుగోలు చేయాలంటే ఆధార్‌ కార్డు ఉండాల్సిందే. ఎందుకంటే ఎరువులు కొనుగోలుకు ఆధార్‌కార్డును కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఆధార్‌ ద్వారా ఎరువులు కొనే పద్ధతిని వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తుంది. రైతులు తమ వెంట ఆధార్‌ తీసుకురాకున్నా.. ఎవరికైనా ఆధార్‌ లేకున్నా అట్లాంటి రైతులకు ఎరువులు అమ్మకూడదని నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు రాష్ట్రంలోని అన్ని ఎరువుల దుకాణాలకు ఆదేశాలు అందాయి. అలాగే ఆయా దుకాణాలకు పాయింట్‌ ఆఫ్‌ సేల్‌(పీవోఎస్‌) యంత్రాలను కూడా అందజేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 6 వేల పీవోఎస్‌ యంత్రాలను సరఫరా చేయాలని భావించగా.. ఇప్పటికి 5 వేల దుకాణాలకు అందజేశారు. అందులో 3 వేల దుకాణాల్లో పూర్తిస్థాయిలో పీవోఎస్‌ యంత్రాలను బిగించినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. కొన్నిచోట్ల పీవోఎస్‌ యంత్రాలు పనిచేయకపోతే వాటిని మార్చి కొత్త వాటిని అందజేస్తున్నారు. 

మున్ముందు డెబిట్‌ కార్డు స్వైప్‌.. 
డీబీటీ విధానంలో రైతు ఎరువుల బస్తా కొనుగోలు చేయాలంటే ప్రస్తుతం ఆధార్‌ కార్డు తీసుకురావాలి. అయితే మున్ముందు డెబిట్‌ కార్డు ద్వారానే లావాదేవీలు జరిపేలా పీవోఎస్‌ యంత్రాలను ఇస్తున్నారు. దాంట్లో ప్రస్తుతం డెబిట్‌ కార్డును ఉపయోగించేలా సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టడంలేదు. రైతులు పూర్తిస్థాయిలో డెబిట్‌ కార్డు లేదా రూపే కార్డు కలిగి ఉన్నట్లు నిర్థారించుకున్నాక పీవోఎస్‌ యంత్రాల్లో సాఫ్ట్‌వేర్‌ను ఆధునీకరిస్తామని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు ఆధార్‌ ద్వారా, మున్ముందు డెబిట్‌ కార్డుతో ఎరువుల విక్రయాలు జరుపుతారు. అలాగే రైతులకు ఒక గుర్తింపు నంబర్‌ కూడా ఇస్తారు. ఈ వివరాలు పీవోఎస్‌ యంత్రాల్లో నిక్షిప్తమై ఎరువుల కొనుగోలు లావాదేవీలు నమోదవుతాయి. లావాదేవీల సమాచారాన్ని కేంద్రానికి సమర్పిస్తే సదరు సబ్సిడీని కంపెనీలకు చెల్లిస్తారు. ఈ విధానంలో సబ్సిడీ చెల్లింపు వ్యవహారం ప్రభుత్వం, కంపెనీల మధ్యనే ఉన్నందున రైతుకు అదనపు ఆర్థిక భారం ఉండబోదని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. 

సబ్సిడీ పక్కదారి పట్టకూడదనే.. 
యూరియా, డీఏపీ తదితర ఎరువులను కంపెనీలు సబ్సిడీ ధరలకే దుకాణాల్లో రైతులకు అందుబాటులోకి తెస్తుంటాయి. అయితే సబ్సిడీ ఎరువులు రైతులకు కాకుండా మిక్సింగ్‌ ప్లాంట్లు, ఇతర అవసరాలకు మళ్లకుండా ఈ కొత్త విధానాన్ని కేంద్రం అమలులోకి తీసుకువస్తోంది. పీవోఎస్‌ పద్ధతి ద్వారా నేరుగా లబ్ధి చేకూర్చే బదిలీ(డీబీటీ) విధానాన్ని అమలు చేయాలనేది కేంద్రం లక్ష్యం. పీవోఎస్‌లను తీసుకోకపోయినా, ఈ పద్ధతిని అమలు చేయకపోయినా సంబంధిత ఎరువుల దుకాణాల లైసెన్సులు రద్దు చేయాలని సర్కారు స్పష్టంచేసింది. వాస్తవానికి ఈ విధానం ఇప్పటికే అమలు కావాల్సి ఉండగా.. సరిపడా పీవోఎస్‌ యంత్రాలు అందుబాటులో లేక వాయిదా వేశారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)