amp pages | Sakshi

'సోమవారంలోగా విచారణకు రండి'

Published on Sat, 07/04/2015 - 15:38

హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు పురోగతి దిశగా సాగుతోంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు సెక్షన్ 41 ఏ సీఆర్పీసీ ప్రకారం ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. సోమవారం సాయంత్రం 6 గంటలలోగా విచారణ కోసం ఏసీబీ కార్యాలయానికి రావాల్సిందిగా సూచించారు. శనివారం ఏసీబీ అధికారులు హైదర్ గూడలోని సండ్ర వెంకట వీరయ్య ఇంటికి నోటీసులు అతికించి వచ్చారు. ఆ సమయంలో సండ్ర ఇంట్లో ఎవరూ లేరు. కాగా ఎల్లుండి ఉదయం 10 గంటలకు సండ్ర ఏసీబీ కార్యాలయానికి రావచ్చని భావిస్తున్నారు. ఈ కేసులో మరికొందరికి నోటీసులు జారీ చేసే అవకాశముంది. టీడీపీకి చెందిన కీలక నేతలను ఏసీబీ విచారించవచ్చని భావిస్తున్నారు.  

ఏసీబీ సండ్ర వెంకట వీరయ్యకు ఇంతకుముందే నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా అనారోగ్యంతో బాధపడుతున్నానని తనకు 10 రోజులు గడువు కావాలని సండ్ర ఏసీబీ అధికారులను కోరారు. గడువు ముగిసినా ఆయన విచారణకు హాజరుకాలేదు. రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరయిన తర్వాత సండ్ర వెంకట వీరయ్య ఏసీబీ అధికారులకు లేఖ రాశారు. తాను రాజమండ్రిలో చికిత్స తీసుకున్నానని, ప్రస్తుతం ఖమ్మంలో ఉన్నానని, ఏ సమయంలోనైనా ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని సండ్ర తన లేఖలో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు సండ్రకు నోటీసులు జారీ చేశారు. సండ్రతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన వేం నరేందర్ రెడ్డిని కూడా ఏసీబీ విచారించే అవకాశముంది. ఏసీబీ అధికారులు సండ్రను అరెస్ట్ చేయవచ్చని భావిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేంనరేందర్ రెడ్డికి ఓటు వేయడం కోసం తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు రేవంత్ రెడ్డి 50 లక్షలు ముడుపులు ఇస్తూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)