amp pages | Sakshi

50 ఏళ్ల తరువాత నోటీసులా?

Published on Thu, 01/15/2015 - 02:10

  • భూ రికార్డుల్లో తప్పుడు ఎంట్రీలపై కొనుగోలుదారులకు నోటీసులా..
  • తెలంగాణ ప్రభుత్వ తీరును తప్పుబట్టిన సుప్రీంకోర్టు
  • న్యూఢిల్లీ: తప్పుడు పద్ధతుల ద్వారా లబ్ధిదారు పొందిన ఉత్తర్వులను సరిచేసే అధికారం ప్రభుత్వానికి కొంతకాలం వరకే ఉంటుందని బుధవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సహేతుక కాలపరిమితిలోపే ఆ ఉత్తర్వులను సరిచేయాలని పేర్కొంది. దాదాపు యాభై ఏళ్ల క్రితం నాటి భూ రికార్డుల్లోని ఎంట్రీలు తప్పుడువని, వాటని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ రంగారెడ్డి జిల్లాలోని గోపన్‌పల్లి గ్రామస్తులకు యాభై సంవత్సరాల తరువాత షోకాజ్ నోటీసులు జారీ చేయడంపై ప్రభుత్వాన్ని తప్పుబట్టింది.

    రికార్డుల్లో తప్పుడు ఎంట్రీలు పడిన 50 ఏళ్ల తరువాత(2004లో) ఆంధ్రప్రదేశ్(తెలంగాణ ప్రాంతం) భూ రెవెన్యూ చట్టంలోని సవరణ అధికారాన్ని (రివిజన్ పవర్) ఉపయోగించడాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. ఆ తీర్పును సవాలు చేస్తూ రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు పై విధంగా స్పందించింది. ఎంతకాలం లోపు రివిజన్ పవర్ ఉపయోగించాలన్న విషయంలో స్పష్టత లేకున్నా.. ఇన్నాళ్ల తరువాత దాన్ని ఉపయోగించడం న్యాయపాలనకు విరుద్ధమని జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ సీ నాగప్పన్‌ల ధర్మాసనం స్పష్టం చేసింది.

    మానవ జీవితంలోని అన్ని చర్యలు, లావాదేవీలను ఏనాటికైనా సవాలు చేసే అవకాశం ఉండటం సమాజంలో అస్థిరతకు దారితీస్తుందని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. న్యాయపాలన ప్రజాజీవితానికి అనుగుణంగా ఉండాలని తీర్పు రాసిన జస్టిస్ నాగప్పన్ సూచించారు. ఒక లావాదేవీ తప్పని తేలితే.. ఎప్పటికైనా దాన్ని సరిచేయొచ్చనే భావన సరికాదని, ఆ సందర్భాల్లో రివిజన్ పవర్‌ను ఉపయోగించడం కూడా తప్పే అవుతుందని జస్టిస్ ఠాకూర్ తేల్చి చెప్పారు. రివిజన్ పవర్‌తో జారీ చేసిన నోటీసులు న్యాయ విరుద్ధమని హైకోర్టు తీర్పివ్వడం సరైన చర్యేనన్నారు.
     
    విషయమేంటంటే: రంగారెడ్డి జిల్లా, గోపనపల్లి గ్రామంలో జాగిర్దార్ల ద్వారా తమకు సంక్రమించిన భూమిలో 90 ఎకరాలను పలువురు పట్టాదారులు అమ్మేశారు. అయితే, ఆ జాగిర్దారీ వ్యవస్థ అప్పటికే రద్దయినందున ఆ వ్యవస్థ ద్వారా సంక్రమించిన భూమిని ‘చిన్న కంచ’(పశువుల మేత కొరకు ఉపయోగించే భూమి)గా వర్గీకరించారని, అది ప్రభుత్వానికి చెందుతుందని, ఆ భూమిని అప్పటి పట్వారీ తప్పుగా రికార్డుల్లో చూపారని పేర్కొంటూ రివిజన్ పవర్ ద్వారా ఆ భూమిని కొన్నవారికి 2004లో ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గోపన్‌పల్లి గ్రామంలోని ఆ 90 ఎకరాలు సహా మొత్తం 477 ఎకరాలను ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కోసం కేటాయిస్తూ 1991లో అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
     

Videos

రౌడీయిజం సాగదు..టీడీపీ నేతలపై ఫైర్

లోక్ సభ స్థానాలపై లెక్కలు ప్రకటించుకున్న పార్టీలు

లోక్ సభ స్థానాలపై లెక్కలు ప్రకటించుకున్న పార్టీలు

పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం

ఏపీ ఎన్నికలపై సీఎం జగన్ ట్వీట్

జేసీకి భారీ షాక్..ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)