ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వర్ధెల్లి లక్ష్మమ్మకు ప్రముఖుల నివాళి
Published on Wed, 12/19/2018 - 11:07
సాక్షి, సూర్యాపేట : సీపీఎం సీనియర్ నాయకుడు వర్ధెల్లి బుచ్చిరాములు సతీమణి, ‘సాక్షి’ఎడిటర్ వర్ధెల్లి మురళి మాతృమూర్తి వర్ధెల్లి లక్ష్మమ్మ భౌతికకాయానికి మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయతో పాటు పలువురు ప్రముఖులు నివాళులర్పించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం వ్యక్తం చేశారు.
సూర్యాపేటలోని తమ నివాసంలో మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలకు గుండెపోటు రావడంతో ఆమె మృతి చెందిన విషయం తెలిసిందే. లక్ష్మమ్మ మృతిపట్ల సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి సంతాపం తెలిపారు. ఆమె భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, చెరుకు సుధాకర్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.
#
Tags