amp pages | Sakshi

ఆకట్టుకున్న అక్కాతమ్ముళ్ల ప్రసంగం

Published on Sat, 03/17/2018 - 09:02

ఇబ్రహీంపట్నంరూరల్‌: యువత దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ పేర్కొన్నారు. యువత చెడు ధోరణులకు అలవాటు పడుతున్నారని, మత్తుపదార్థాల జోలికి వెళ్లి జీవితం నాశనం చేసుకోవద్దని సూచించారు. ఇబ్రహీంపట్నం మండలం మంగళ్‌పల్లి గ్రామ సమీపంలోని సీవీఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో సిన్సియా– 2కె18 పేరుతో సాంకేతిక సంబరాలు జరిగాయి. రెండో రోజు ప్రభుత్వ అధికారులు, ప్రముఖుల చేత ముఖాముఖి, అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన అకున్‌సబర్వాల్‌ మాట్లాడుతూ ఇంటర్నేషనల్‌ స్కూళ్లల్లో విద్యా ర్థులు డ్రగ్స్‌కు అలవాటు పడి జీవితాలను పా డు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను మత్తు రహిత నగరంగా తీర్చిదిద్దామని చెప్పారు. అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠా ను పట్టుకుని 21 మందిని అరెస్టు చేసి 12 కేసు లు నమోదు చేశామని చెప్పారు.  రాష్ట్ర ప్రభు త్వం డ్రగ్స్‌ విక్రయాలపై కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. మీడియా, సెల్‌ఫోన్‌ల ప్రభావం వల్ల యువత చెడు అలవాట్లకు లోనవుతున్నా రని చెప్పారు. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని సూచించారు. అనంత రం విద్యార్థులు, అధ్యాపకులు అడిగిన పలు ప్ర శ్నలకు అకున్‌సబర్వాల్‌ సమాధానం ఇచ్చారు. 

చదువే అన్నింటికీ సమాధానం  
కార్యక్రమంలో పాల్గొన్న ఆధ్యాత్మిక గురువు, శ్రీపీఠం నిర్వాహకులు పరిపూర్ణానంద స్వామీజీ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. విద్య అంటే సమాధానం, పరిష్కార మార్గమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను గౌరవించాలని, వారిని జీవితకాలం చూసుకోవాలన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను గుర్తుంచుకోవాలని సూచించారు. భారతదేశ ఔన్నత్యాన్ని పెంపొందించడానికి అందరం కలిసి కృషిచేయాలని చెప్పారు. ప్రతి ఒక్కరినీ విద్యావంతులను చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో  300 గ్రామాలను దత్తత తీసుకొని అందులో వెనుకబడిన తరగతులకు చెందిన పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నామని వెల్లడించారు. 

ఆకట్టుకున్న అక్కాతమ్ముళ్ల ప్రసంగం
పదిహేడేళ్ల అతి చిన్న వయసులోనే పీహెచ్‌డీ ప్రవేశం పొందిన అంతర్జాతీయ టెన్నిస్‌ క్రీడాకారిని నైనా జైస్వాల్, 9 సంవత్సరాల ప్రాయంలోనే పదో తరగతి పూర్తి చేసిన అగస్త్య జైస్వాల్‌లు విద్యార్థులను ఉద్దేశించి చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. తల్లిదండ్రుల తో పాటు గురువుల ప్రోత్సాహం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని చెప్పారు. తెలుగు, హిందీ, సంస్కృత భాషల్లో చక్కగా మాట్లాడి అబ్బుర పరిచారు. చదువుల్లో, ఆటల్లో రాణించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్‌ రాఘవ చిరబుడ్డి, కళాశాల ప్రిన్సిపల్‌ నయనతార, వైస్‌ ప్రిన్సిపల్‌ రామశాస్త్రీ, జేఎన్‌టీయూ రిటైర్డ్‌ రిజిస్ట్రార్‌ కిషన్‌లాల్, కళాశాల సీనియర్‌ ప్లేస్‌మెంట్‌ అధికారి విజయ మేరీ, వివిధ విభాగాల హెచ్‌ఓడీలు, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

చదువులు సమాజానికి ఉపయోగపడాలి
ఇబ్రహీంపట్నంరూరల్‌: మనం చదివిన చదువులు సమాజం కోసం ఉపయోగపడాలని సాంకేతిక విద్యశాఖ కమిషనర్‌  నవీన్‌ మిట్టల్‌ పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని మంగళ్‌పల్లి గ్రామ సమీపంలో గల సీవీఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో గత రెండు రోజులుగా సిన్సియా 2కె18 పేరుతో సాంకేతిక సంబరాలు జరిగాయి. ముగింపు ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా  నవీన్‌ మిట్టల్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాంకేతికరంగంలో విద్యార్థులు పురోగతి సాధించాలన్నారు. ప్రస్తుతం సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయని, మార్పులకు అనుగుణంగా కొత్త ఆవిష్కరణ కనుగొనాలన్నారు. కృషి, పట్టుదలతో విద్యనభ్యసిస్తే అనుకున్నది సాధించడం ఖాయమన్నారు. ప్రతి ఒక్కరూ చదువుతో పాటు సంస్కారాన్ని నేర్చుకొని దేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం నవీన్‌మిట్టల్‌ను కళాశాల చైర్మన్‌ రాఘవ చీరబుడ్డీ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ నయనతార, సీనియర్‌ ప్లేస్‌మెంట్‌ అధికారి విజయమేరీలతో పాటు కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)