amp pages | Sakshi

గూడు సమాధుల గుట్టు వీడనుంది!

Published on Fri, 12/01/2017 - 03:43

సాక్షి, హైదరాబాద్‌: ఒకటి కాదు రెండు కాదు వందల నిర్మాణాలు.. గుట్టలపై, దట్టమైన అడవిలో రాతి గుహల్లాంటి ఏర్పాట్లు.. చిన్న ద్వారం, తొంగి చూస్తే రాతి తొట్లు.. చుట్టూ భారీ రాతి గుండ్లతో కంచె.. కచ్చితమైన వృత్తా కారంలో ఏర్పాటు.. ప్రతి నిర్మాణం ముందు మానవాకృతిని సూచించే భారీ శిలలు.. వరం గల్, ఖమ్మం జిల్లాల్లో గోదావరి తీరం వెంట కనిపించే ఆది మానవుల సమాధుల ప్రత్యేక తలివి. ఇప్పటికీ ప్రపంచంలో మరెక్కడా ఈ తరహా సమాధి నిర్మాణాలను గుర్తించలేదు.

తెలంగాణ చరిత్రకే పరిమితమైన అరుదైన ఈ నిర్మాణాల గుట్టు వీడనుంది. గతంలో అమెరికాకు చెందిన శాన్‌డియాగో విశ్వవిద్యాల యం ప్రొఫెసర్‌ థామస్‌ ఇ లెవీ ఆధ్వర్యంలోని బృందం ఈ సమాధులను పరిశీలించి.. ఇవి ఈ ప్రాంతానికే ప్రత్యేకమైనవిగా తేల్చారు. వీటి నిగ్గు తేల్చేందుకు లైడార్‌ సర్వే చేస్తామనీ ప్రకటించారు. తాజాగా భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) ఈ సమాధుల నిగ్గు తేల్చేందుకు తవ్వకాలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు వచ్చే ఏడాది ఖమ్మం జిల్లా పినపాక మండలం జానంపేట వద్ద తవ్వకాలు మొదలు కాబోతున్నాయి. తెలంగాణలో చాలాకాలం తర్వాత ఏఎస్‌ఐ చేపట్టే భారీ అన్వేషణ ఇదే.

రాతిని తొలిచిన తొలి కాలం అదేనా?
రాతిని తొలిచి ఆకృతిగా మలచటం క్రీస్తుపూర్వం 2 వేల ఏళ్ల క్రితం సింధూ నాగరి కతలో కనిపించిందని చరిత్ర చెబుతోంది. స్థాని కంగా క్రీస్తుపూర్వం 300 ఏళ్లనాడు మౌర్యుల కాలంలో ఆ తరహా శిల్పకళా వైభవం కనిపిం చింది. మరి ఈ రెండింటి మధ్య కాలంలో ఏం జరిగిందన్న దానికి స్పష్టమైన సమాచారం లేద ని నిపుణులు చెబుతారు.

కానీ వరంగల్, ఖమ్మం మధ్య గోదావరి తీరంలో విస్తరించిన అడవులు, గుట్టలపై విస్తారంగా ఉన్న ఆది మానవుల సమాధులను పరిశీలిస్తే.. రాళ్లను ఆకృతిలోకి మలిచిన దాఖలాలు కనిపిస్తాయి. ఇవీ క్రీస్తుపూర్వం 1000–600 ఏళ్ల మధ్యనాటి వని ప్రాథమిక అంచనా ఉంది. ఇదే నిజమైతే సింధూ నాగరికత అంతరించాక రాతిని తొలిచి ఆకృతులుగా చెక్కిన కాలం ఇక్కడ నుంచి మొదలైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఎలా చెక్కారు?
ఇక్కడి గుట్టల్లో, దట్టమైన అడవుల్లో వేల సం ఖ్యలో ఆది మానవుల సమాధులు విస్తరించి ఉన్నాయి. నాలుగైదు అడుగుల విస్తీర్ణంలో ఉండే పెద్ద పెద్ద బండరాళ్లు నిలిపి ఉంటాయి. వాటి వెలుపలి భాగం అర్ధ చంద్రాకారంలో చెక్కి ఉంటుంది. అన్ని రాళ్ల ఆకృతిని కలిపితే సంపూర్ణ వృత్తాకారంగా కనిపిస్తుంది. ఈ రాళ్ల మధ్య పది పదిహేను అడుగుల వెడల్పున్న గూడు ఉంటుంది. దానికి చిన్న ద్వారంతో పాటు లోపల ఏడెనిమిది అడుగుల పొడవున్న రాతి తొట్టి ఉంటుంది. అందులో మానవ అవశే షాలను గుర్తించారు. ఇక సమాధి ముందు అది ఎవరి సమాధి అని తెలిపేలా స్త్రీ/పురుష ఆకృతి లో ఎత్తయిన రాతి శిల పాతి ఉంటుంది.

ఇనుము వాడిన దాఖలాలు
నిజాం హయాంలో 1940–41 సమయంలో నాటి పురావస్తు శాఖ ఉన్నతాధికారి ఖాసీ మహ్మద్‌ అహ్మద్‌ ఆధ్వర్యంలో ఈ ప్రాంతాల్లో తవ్వకాలు జరిగాయి. ఆ సమయంలో గుర్రాల ముక్కుకు బిగించే ఇనుప వస్తువులు, నాగలికి ఏర్పాటు చేసే పరికరాలను, కొన్ని మట్టిపాత్రలు, ఇతర ఆకృతులు, ఆయుధాలను గుర్తించారు.

ప్రస్తుతం కేంద్ర పురావస్తు శాఖ ఈ సమాధుల గుట్టు విప్పేందుకు పినపాక మండలం జానంపేట ప్రాంతాన్ని కేంద్ర పురావస్తు శాఖ తన అధీనంలోకి తీసుకుంది. కొన్ని వందల ఎకరాల ప్రాంతాన్ని రక్షిత ప్రాంతంగా నిర్ధారించింది. ఆధునిక పద్ధతుల్లో, డీఎన్‌ఏ పరీక్షలను ఉపయోగించి ఆ సమాధులు ఏ కాలానికి చెందినవి, నాటి మనుషుల జీవన శైలి ఏమిటి, వారు స్థానికులేనా, వేరే ప్రాంతం నుంచి వలస వచ్చారా, ఇప్పుడు ఆ జాతి కొనసాగుతోందా, ఉంటే ఎక్కడ మనుగడలో ఉందన్న వివరాలను తేల్చనుంది. ఇది విదేశీ పరిశోధకులు, పర్యాటకులను బాగా ఆకట్టుకుంటుందని ఏఎస్‌ఐ భావిస్తోంది.

#

Tags

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)