amp pages | Sakshi

ప్రచార బాటలో.. కళాకారులు

Published on Thu, 11/15/2018 - 11:46

శాసనసభ ఎన్నికల నేపథ్యంలో రోజువారి కూలీలు, కళాకారులకు భలే గిరాకీ దొరుకుతోంది. ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రాధాన్యమిస్తూ జన బలం చూయించుకోవడానికి రాజకీయ పార్టీల నాయకులు నానా తంటాలు పడుతున్నారు.జనసమీకరణకు ఎక్కువ పాధాన్యమిస్తుండటంతో కూలీలు, కళాకారులకు డిమాండ్‌ పెరిగింది. ఖర్చుకు వెనుకాడకుండా కూలీలను కార్యకర్తలుగా చూపుతున్నారు. ఎక్కడ ప్రచారంలో సంఖ్య తక్కువ కాకుండా చూసుకుంటూ భోజనంతో పాటు మద్యంసైతం అందిస్తున్నారని అంటున్నారు. ఖర్చుల పేరుతో డబ్బు కూడా పంచుతున్నారు.  

సాక్షి,సూర్యాపేట : ముందస్తు ఎన్నికల పుణ్యమా అని వివిధ  రాజకీయ పార్టీలు నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాలు చాలా మందికి ఆర్థికంగా ఉపయోగపడుతున్నాయి. కూలీలకు శాసనసభ ఎన్నికలు పని కల్పిస్తున్నాయని చెప్పవచ్చు. జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలు గ్రామాలు, పట్టణాల్లో తిరుగుతూ ప్రజల నుంచి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంలో తమను ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నారు. ఈ క్రమంలోతమ వెంట ఎవరూ లేరన్న పేరు రాకుండా చూసుకుంటున్నారు. పార్టీ శ్రేణులు, అభిమానులతో పాటు కార్యకర్తలను పురమాయిస్తున్నారు. ముఖ్యంగా రోజువారి కూలీలను కార్యకర్తలుగా చూపుతూ వారిని ప్రచారంలో భాగస్వాములను చేస్తున్నారు. వీరిలో రోజుకూ పురుషులకు రూ. 300, మహిళలకు రూ. 200 చొప్పున చెల్లిస్తున్నారు. భోజన సౌకర్యం, రవాణా ఖర్చులుసైతం చెల్లిస్తున్నారు. దీంతో గ్రామాల్లో కూలీలు కనిపించడం లేదు. పంటలు చేతికందే సీజన్‌ కావడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 
ద్వితీయశ్రేణి నేతలకు జన సమీకరణ బాధ్యతలు
ఎన్నికల ప్రచారానికి జనసమీకరణ బాధ్యతలను ద్వితీయ  శ్రేణి నాయకులకు అప్పగిస్తున్నారు. ఇందుకు గ్రామాల్లో జనంతో ఎక్కువగా మమేకమైన వారిని, నమ్మకమైన వ్యక్తులను ఎంచుకుంటున్నారు. వారే దగ్గరుండి ప్రచారం ముగిసే వరకు అన్నీ చూసుకునేలా చర్యలు చేపడుతున్నారు. ప్రచారంలో కార్యకర్తలు తక్కువగా ఉంటే వచ్చే ఇబ్బందులను గుర్తించి ద్వితీయశ్రేణి నాయకులు ముందస్తుగానే పెయిడ్‌ కార్యకర్తలను సిద్ధం చేసుకుంటున్నారు.
కళాకారులకు కూడా..
డప్పు, కోలాట, జానపద కళాకారులకు కూడా భలే గిరాకీ పెరిగింది. డిజేలు, మైకులు, ఆటోలకు కూడా అదే స్థాయిలో గిరాకీ ఉంటోంది. ప్రచారంలో ఆర్భాటం లేనిది ప్రజలు బయటకు రావడం లేదు. దీంతో డప్పు కళాకారులు పల్లెల నుంచి పట్నం బాట పట్టారు. ఇక కోలాట కాళాకారులైతే గ్రామానికి ఒక గ్రూప్‌ వెలిసింది. ప్రతి కళాకారుడికి వసతులు కల్పించి రూ. 500 ఇస్తుండటంలో తీరిక లేకుండా పని చేస్తున్నారు.  ప్రచారానికి ఆటోలో మైక్‌లు వాడుతుండటంతో వాటికి కూడా గిరాకీ పెరిగింది.   

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)