amp pages | Sakshi

మూసీలో వాజ్‌పేయి చితాభస్మం నిమజ్జనం

Published on Fri, 08/24/2018 - 10:15

అనంతగిరి : భారత మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌బిహారీ వాజ్‌పేయి మరణం దేశానికి తీరని లోటని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి అన్నారు. పట్టణ సమీపంలోని బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయ సమీపంలోని మూసీ జన్మస్థలంలో వాజ్‌పేయి అస్థికలు, చితాభస్మాన్ని నిమజ్జనం చేశారు. వాజ్‌పేయి అస్థికలు తీసుకువచ్చిన హైదరాబాద్, లంగర్‌హౌస్, ఆరెమైసమ్మ, మెయినాబాద్, చేవెళ్ల, మన్నెగూడ, వికారాబాద్‌ పట్టణంలోని అన్ని ప్రధాన మార్గాల్లో ప్రజలు, బీజేపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.

అడుగడుగునా పూలమాలలు వేసి ఘనంగా సాగనంపారు మూసీ నదిలో కర్మయోగి వాజ్‌పేయి అస్థికలు నిమజ్జనం చేయడం ఈ ప్రాంత అదృష్టంగా భావిస్తున్నామని ప్రజలు అభిప్రాయపడ్డారు. అస్థికల ర్యాలీ బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయానికి చేరుకున్న తర్వాత గంగమ్మకు పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య చితాభస్మం, అస్థికలను నిమజ్జనం చేశారు.

అనంతరం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి అన్నదానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ పెద్దదిక్కును కోల్పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా ఉంటూ ఇద్దరు ఎంపీలున్న పార్టీని దేశంలోనే అధికారంలోకి తీసుకురావడంలో ఆయన చేసిన కృషి ఎనలేనిదన్నారు.

వాజ్‌పేయి అస్థికలను మూసీలో నదిలో కలపడానికి తాము వెళ్లడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. దేశంలోని అన్ని ప్రధాన నదుల్లో వాజ్‌పేయి అస్థికలు కలుపుతున్నట్లు వివరించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి మాట్లాడుతూ.. నమ్మిన సిద్ధాంతాల కోసం ఆఖరువరకు పాటుపడిన నేత వాజ్‌పేయి అని కొనియాడారు. తన హయాంలో కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు రోడ్లు వేయించారని గుర్తుచేశారు. దేశంలో గ్రామగ్రామా మహిళలకు గ్యాస్‌ పంపిణీని గ్రామగ్రామన అందేలా చేశారని కొనియాడారు.

కార్గిల్‌ యుద్ధంలో సైతం అగ్ర దేశాలు ఆంక్షలు విధించినా ఎక్కడా వెనకడుగు వేయలేదని తెలిపారు. భారత్‌ శక్తిని ప్రపంచానికి చాటిన ప్రధానిగా ఖ్యాతిగడించారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కరణం ప్రహ్లాద్‌రావు, రాష్ట్ర నాయకులు శేరి నర్సింగ్‌రావు, బొక్కా నర్సింహరెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్, సీనియర్‌ నాయకులు పాండుగౌడ్, మాధవరెడ్డి, సదానంద్‌రెడ్డి, రమేష్‌కుమార్, శివరాజు, సుచరితరెడ్డి,సాయికృష్ణ, రవిశంకర్, పోకల సతీష్, నరోత్తంరెడ్డి, కేపీరాజు, రాచ శ్రీనివాస్‌రెడ్డి, నందు, శంకర్, అమరేందర్‌రెడ్డి, సాయిచరణ్‌ రవితేజ పలువురు పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.  

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)