amp pages | Sakshi

మా సభ్యులపై దాడి చేశారు

Published on Sun, 03/08/2015 - 04:12

హైదరాబాద్: తమ సభ్యులపై అధికార పార్టీ సభ్యులు దాడిచేశారంటూ టీడీపీ ఎ మ్మెల్యేలు స్పీకర్ మధుసూదనాచారికి ఫిర్యాదు చేశారు. పార్టీ ఫ్లోర్‌లీడర్ ఎర్రబెల్లి నేతృత్వంలో సభ్యులు స్పీకర్ గది వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో అటుగా వెళుతున్న బీజేపీ ఎమ్మె ల్యే కిషన్‌రెడ్డిని తమకు సహకరించాల్సిం దిగా, అంతా కలసి ఉంటేనే అధికారపక్షాన్ని ఎదుర్కొంటామంటూ కోరారు. తాను టీఆర్‌ఎస్‌లో చేరనందుకే తనపై దాడిచేశారని ఎమ్మెల్యే ప్ర కాష్‌గౌడ్ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే, రాత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని స్పీకర్ సూచించడంతో వారు వెనుదిరిగారు. ‘ పార్టీలు ఫిరాయించిన వారిపై అనర్హత వేటువేసే వరకు మా ఆందోళన కొనసాగుతుంది. తలసాని శ్రీనివాస్‌యాదవ్‌పై చర్య తీసుకునే దాకా నిరసన కొనసాగిస్తాం. సభ్యులపై దాడి విషయం పై బీఏసీ ముగిశాక కాంగ్రెస్, బీజేపీలతో కలసి స్పీకర్‌కు విజ్ఞప్తి చేశాం..’ అని ఎర్రబెల్లి ఆ తర్వాత లాబీల్లో  విలేకరులతో పేర్కొన్నారు.

Videos

కాసేపట్లో కర్నూలులో సీఎం జగన్ ప్రచారం

ఎన్నికల ప్రచారంలో మంత్రి రోజాకు అపూర్వ స్వాగతం

పచ్చ మద్యం స్వాధీనం..

బాబును నమ్మే ప్రసక్తే లేదు..

మహిళలపైనా పచ్చమూకల దాష్టీకం..

నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే

విజనరీ ముసుగేసుకున్న అవినీతి అనకొండ

విజయవాడలో సాక్షి ప్రజా ప్రస్థానం

పవన్, బాబు, లోకేష్ పై జోగి రమేష్ పంచులు

వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

Photos

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)