చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'కుర్చీ ఎక్కాక మాట మారుస్తున్నారు'
Published on Thu, 08/31/2017 - 14:35
హైదరాబాద్: తెలంగాణ విమోచన యాత్ర రేపటి నుంచి ప్రారంభమవుతుందని.. ఈ యాత్రలో భాగంగా వారం రోజుల పాటు అన్ని జిల్లాల్లో పర్యటిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. ఆయన ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ.. 'రజాకార్ల ఆగడాలకు సాక్షాలుగా నిలిచిన ప్రాంతాలు తెలంగాణలో చాలా ఉన్నాయి. వాటన్నిటిని సందర్శించి తెలంగాణ విమోచన దినోత్సవం ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేస్తాం. తెలంగాణ ఆత్మగౌరవంతో ముడిబడిన దినోత్సవాన్ని.. ముఖ్యమంత్రి కేసీఆర్ మాట ఇచ్చి తప్పించుకుంటున్నారు.
నాటి ముఖ్యమంత్రిని ప్రశ్నించిన కేసిఆర్ ఇప్పుడు తనేందుకు విస్మరిస్తున్నాడు? తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించకపోతే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి రోశయ్య ప్రభుత్వాన్ని కూల్చాలని నాడు కేసీఆర్ పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక అధికారికంగా నిర్వహిస్తామని చెప్పిన కేసీఆర్ కుర్చి ఎక్కాక మాట మారుస్తున్నారు' అని విమర్శించారు.
#
Tags