amp pages | Sakshi

మూడేళ్లలో ముగ్గురు

Published on Sat, 04/18/2015 - 03:02

నిజాంసాగర్ : ప్రభుత్వ ఉద్యోగులు సేవే పరమావధిగా బావించాల్సింది పోయి లంచాల కోసం అమాయకులను పీడిస్తూ కటకటాల పాలవుతున్నారు. ఒక జుక్కల్ నియోజకవర్గంలోనే మూడేళ్లలో ముగ్గురు ఉద్యోగులు ఎసీబీ చిక్కడంతో అవినితీ ఏ మేరకు జరుగుతుందో తెలుస్తోందని పలువురు అంటున్నారు. లంచావతారుల ఆట కట్టించడానికి ఎసీబీ అధికారులు దాడులు చేస్తున్నా, ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం పనితీరు మార్చుకోకపోవడంతో బోను ఎక్కాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయి.

వరుసగా మూడేళ్ల కాలంలో ఎసీబీ అధికారులు దాడులు చేసి ముగ్గురు లంచవతారులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిజాంసాగర్, పిట్లం, మద్నూర్, బిచ్కుం ద, జుక్కల్ మండలాల్లో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ అధికారులు, ఉద్యోగు లు లంచావతారులుగా మారుతున్నారు. 2013 అక్టోబర్‌లో మద్నూర్ మండలంలోని సలాబత్‌పూర్ చెక్ పోస్టుపై ఎసీబీ అధికారులు దాడి చేశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ రమేష్‌బాబు రూ. 18,177 అక్రమ డబ్బుతో ఎసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.  

2014 సెప్టెంబర్‌లో సలాబత్‌పూర్ చెక్‌పోస్టుపై ఎసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏఎంవీఐ వీరస్వామి 34,100 రుపాయలతో రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డారు. ప్రస్తుతం బిచ్కుంద మండల ట్రాన్స్‌కో ఎఈ ప్రేమ్‌కుమార్ రూ. 8 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయూరు.  
 
కళ్లు తెరవని అధికారులు...
మండల స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి అక్రమాలు జరుగుతున్నా ఉన్నతాధికారులు మాత్రం కళ్లు తెరవడం లేదు. అధికారుల పనితీరుపై పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు ఉద్యోగులు లంచానికి అలవాటుపడుతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి కిందిస్థాయి ఉద్యోగులు, అధికారులపై దృష్టి సారించి అక్రమాలను అరికట్టాలని పలువురు కోరుతున్నారు.

#

Tags

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)