ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తేనెటీగల దాడిలో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి మృతి
Published on Wed, 11/19/2014 - 02:01
జైనథ్: తేనెటీగల దాడిలో ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందిన సంఘటన మంగళవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని బీఎస్ఎన్ఎల్ ఎక్స్ఛేంజ్ కార్యాలయంలో ఎంఏ హమీద్ఖాన్ (53) టెలిఫోన్ మెకానిక్గా విధులు నిర్వర్తిస్తున్నారు. సంవత్సరకాలంగా కార్యాలయం పైకప్పుకు బయటి భాగం నుంచి తేనెటీగలు తుట్టెలను ఏర్పర్చుకున్నాయి.
మంగళవారం విధులకు హాజరైన హమీద్ ఖాన్ మధ్యాహ్న సమయంలో భోజనం ముగించుకుని కార్యాలయంలో సేద తీరుతుండగా తేనెటీగలు దాడి చేశాయి. పక్కనే ఉన్న ఎంపీడీవో, తహసీల్దార్, సొసైటీ కార్యాలయాల వైపు కూడా తేనెటీగలు విజృంభించాయి. తీవ్రంగా గాయపడిన హమీద్ఖాన్ అక్కడికక్కడే చనిపోయారు.
#
Tags