amp pages | Sakshi

రాష్ట్రంలో మరో 21 సఖి కేంద్రాలు

Published on Fri, 09/29/2017 - 01:18

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని మరిన్ని సఖి కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుముఖతను వ్యక్తం చేసింది. ఆపదలో ఉన్న మహిళలను ఆదుకునేందుకు సఖి కేంద్రాలను కేంద్రం ఏర్పాటు చేస్తోంది. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఈ కేంద్రాలను నిర్వహిస్తోంది. ఆపదలో ఉన్న మహిళలకు రక్షణ కల్పించడం, న్యాయ సహా యం అందించడం, లైంగిక వేధింపుల బారిన పడిన మహిళలను ఆదుకోవడంతో పాటు వైద్య చికిత్సను సఖి కేంద్రాల్లో పొందవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన ఉమెన్‌ హెల్ప్‌లైన్‌ కేంద్రాల నిర్వహణ, పర్యవేక్షణ సైతం వీటి ద్వారానే కొనసాగుతోంది. పూర్వపు పది జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున సఖి కేంద్రాలు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటైన జిల్లా కేంద్రాల్లోనూ వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కేంద్రా నికి ప్రతిపాదనలు సమర్పించగా కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఫలితంగా రాష్ట్రంలో కొత్తగా 21 సఖి కేంద్రాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

కొత్త కేంద్రాలను ఎక్కడ ఏర్పాటు చేద్దాం..?
కొత్తగా ఏర్పాటు చేయనున్న సఖి కేంద్రాలను ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయాలనే అంశంపై కేంద్రం స్పష్టత కోరింది. ఇటీవల కేంద్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ రాష్ట్రంలో పర్యటించినప్పుడు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు సఖి కేంద్రాల అంశాన్ని ప్రస్తావించారు. దీంతో ఆమె స్పం దిస్తూ పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు పంపాలని సూచించారు. కొత్త కేంద్రాల ఏర్పాటుపై రాష్ట్ర యంత్రాంగం కసరత్తును వేగవంతం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 10 కేంద్రాలు దాదాపు జిల్లా ఆస్పత్రి, ప్రాంతీయ ఆస్పత్రుల ఆవరణలోగానీ, వాటి సమీపంలోగానీ ఉన్నాయి. ఈ క్రమంలో కొత్త కేంద్రాలను సైతం జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో పక్కా భవనాలను గుర్తించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కేంద్రాల ఏర్పాటుకు స్థలాలు ఖరారైన వెంటనే నిధులు విడుదల చేస్తామని కేంద్రం తెలిపింది. ఒక్కో కేంద్రానికి గరిష్టంగా రూ.50 లక్షలు విడుదల చేసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.   

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)