amp pages | Sakshi

మీ అభి‘మత’మేంటి?

Published on Thu, 05/21/2020 - 03:58

సాక్షి, హైదరాబాద్‌: ఒకపక్క కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నా.. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌కు కేంద్రం భారీ సడలింపులు ఇస్తుండటంతో క్రమంగా జన జీవితం మళ్లీ సాధారణస్థితికి చేరుకుంటోంది. దుకాణాలు తెరుచుకుంటున్నాయి, ప్రజా రవాణా ప్రారంభమైంది. మరి ప్రార్థన మందిరాలు ఎప్పుడు తెరుచుకుంటాయి?
ఇప్పుడు చాలామంది ఎదురుచూస్తున్న అంశమిది. వీటి విషయంలో కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. ఒకసారి ప్రార్థన మందిరాలు తెరుచుకుంటే వాటిని నియంత్రించటం అంత సులువు కాదని కేంద్రం అభిప్రాయపడుతోంది. (జంతువుల నుంచే 75 శాతం ఇన్‌ఫెక్షన్లు)

ఈ క్రమంలోనే సామూహిక, బహిరంగ ధార్మిక కార్యక్రమాలపై మూడు నెలల పాటు ఆంక్షలు విధించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కార్యకలాపాలు మొదలైతే జనసమూహాలు ఏర్పడతాయని భావిస్తోన్న కేంద్రం.. వాటిని ప్రారంభించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాన్ని తీసుకుంటున్నట్టు సమాచారం. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లాంటి కొన్ని దేశాల్లో ధార్మిక కార్యక్రమాలతో కరోనా కేసులు తీవ్రంగా పెరిగినట్టు స్వయంగా ఆయా దేశాల్లో అధికారికంగా సమాచారం వెల్లడైంది. ఇప్పటివరకు ఆ విషయంలో మన దేశం సురక్షితంగా ఉంది. 

అన్ని మతాల ప్రార్థన మందిరాలు మూసే ఉంచటంతోపాటు వేడుకల్ని ప్రభుత్వం నిషేధించింది. పూర్తిగా అంతర్గత కార్యక్రమంగా రోజువారీ ప్రార్థనలు, ఉత్సవాలకు అనుమతించింది. దేవాలయాల్లో అర్చకులు, మసీదుల్లో మౌజమ్‌లు, చర్చ్‌లలో ఫాదర్‌లు మాత్రమే కార్యక్రమాలు నిర్వహించాలి తప్ప భక్తులకు ప్రవేశం కల్పించరాదని ఆదేశించింది. దాన్ని కచ్చితంగా అమలు చేస్తుండటంతో ధార్మిక కార్యక్రమాలపరంగా ఇంతకాలం ఎలాంటి చింత లేదు. 

ఇప్పుడు లాక్‌డౌన్‌ సడలింపుల జాబితాలో ప్రార్థన మందిరాలను చేరిస్తే పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని కొన్ని సంస్థలు కేంద్రం దృష్టికి తెచ్చాయి. దీంతో కేంద్రం రాష్ట్రాల అభిప్రాయాన్ని తీసుకుంటున్నట్టు సమాచారం. అక్కడి నుంచివచ్చే ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా, ఈనెల 31తో లాక్‌డౌన్‌ ముగియనున్న నేపథ్యంలో.. తదుపరి నిర్ణయం తీసుకోనుంది. 

బహిరంగ ఉత్సవాలు, సామూహిక ప్రార్థనలకు అనుమతి వద్దు
గతంలో ఎన్నడూ లేనట్టు దాదాపు రెండు నెలలుగా ప్రార్థన మందిరాలు మూసే ఉన్నాయి. వాటినింకా మూసి ఉంచటం సరికాదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. దీంతో వాటిని ప్రత్యేక షరతులకు లోబడి తెరిచేందుకు అనుమతించాలనే విషయమై చర్చ జరుగుతోంది. రోజూ వేల మంది భక్తులు వచ్చే ప్రధాన ఆలయాల్లోకి పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతిస్తూ కరోనా నిబంధనలు పాటించాలనే షరతు విధించనున్నట్టు సమాచారం. 

చిన్న ప్రార్థన మందిరాల్లో ఒకసారి పదిమందికి మించకుండా భక్తులను అనుమతించేలా నిబంధనలు రూపొందిస్తున్నట్టు ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. అన్ని మతాలకు చెందిన ప్రార్థనాలయాలకు ఇదే తరహా నిబంధనలు అమలు చేయాలనేది ఒక ఆలోచనగా ఆయన పేర్కొన్నారు. వీటితోపాటు సామూహిక ప్రార్థనలు, బహింరంగ వేడుకలు, ఉత్సవాలు, ప్రదర్శనలు, యాత్రలు నిర్వహించకుండా ఆంక్షలు కొనసాగించనున్నారు. దేవాలయాల్లోనే కాక బహిరంగ ప్రాంతాల్లో ధార్మిక వేడుకలు నిర్వహించరాదని కూడా ఆంక్షల్లో చేరుస్తారన్న చర్చ నడుస్తోంది. 

ఇక వేడుకల పేరుతో అన్నదాన వితరణ, ప్రసాదాల పంపిణీపై కూడా ఆంక్షలుండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇటీవల దక్షిణ బంగ్లాదేశ్‌లోని ఓ పట్టణంలో స్థానిక సంస్థ ఒకటి ప్రభుత్వం వద్దంటున్నా వినకుండా బహిరంగ ప్రదేశంలో 10వేల మందితో సామూహిక ప్రార్థనలు నిర్వహించింది. పాకిస్తాన్‌లో వైద్యుల సంఘం అభ్యంతరం చెప్పినా.. సామూహిక ప్రార్థనలకు అనుమతించారు. ఈ రెండుచోట్లా ఒక్కసారిగా కరోనా కేసులు బాగా పెరిగాయి. ఈ అంశాలన్నింటినీ కేంద్రం పరిశీలిస్తోంది. రాష్ట్రాల నుంచి వచ్చే అభిప్రాయాల ఆధారంగా కేంద్రం నిర్ణయం తీసుకోనుంది. వాటిని తెరిచే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక సూచనలు చేయనుంది. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)