amp pages | Sakshi

ఓటరు నమోదుకు నాలుగు రోజులే!

Published on Tue, 03/12/2019 - 01:57

సాక్షి, హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికల్లో ఓటరుగా పేరు నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. రాష్ట్రంలో ఈ నెల 15లోగా ఓటరుగా నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్‌ కుమార్‌ తెలిపారు. గడువులోగా పేరు నమోదు చేసుకున్న వారు ఏప్రిల్‌ 11న జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు పొందొచ్చని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ గడువు ఈ నెల 25తో ముగియనుండగా దానికి 10 రోజుల ముందు వరకు దరఖాస్తు చేసుకున్న అందరికీ ఓటు హక్కు కల్పిస్తామని వివరించారు. ఆ తరువాత వారంపాటు దరఖాస్తులను పరిశీలించి పరిష్కరిస్తామన్నారు.

ఒకవేళ దరఖాస్తు తిరస్కరిస్తే ఈ నెల 25 వరకు కలెక్టర్‌కు అప్పీల్‌ చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు మాత్రం ఈ నెల 25 వరకు ఓటరుగా నమోదు చేసుకోవచ్చన్నారు. లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో రజత్‌ కుమార్‌ సోమవారం సచివాలయంలో సమావేశమయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 14న ఈవీఎంల పరిశీలనకు, 25న ఓటర్ల జాబితాల పరిశీలనకు కేంద్ర ఎన్నికల సంఘం బృందాలు రాష్ట్రానికి రానున్నాయన్నారు.

ఎన్నికల కోడ్‌లో భాగంగా బహిరంగ మద్యపానం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రజత్‌ కుమార్‌ హెచ్చరించారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలకు సంబంధించిన కేసులు, వాటిపై తీసుకునే చర్యల వివరాలను ఎప్పటికప్పుడు ప్రకటిస్తామన్నారు. ప్రభుత్వ భవనాలు, ఇతరత్రా వాటిపై ఉన్న ప్రకటనలను తొలగించాలని ఇప్పటికే ఆదేశించామన్నారు. వెబ్‌సైట్లలోని ప్రభుత్వ ప్రకటనలపై ఐటీశాఖ నుంచి నివేదిక కోరామన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన సదుపాయాలతోపాటు అత్యవసర వైద్య సదుపాయం కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించామన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో తాగునీరు ఏర్పాటు చేస్తామన్నారు. సీఈఓతో జరిగిన భేటీలో కాంగ్రెస్‌ నేతలు మర్రి శశిధర్‌రెడ్డి, నిరంజన్, బీజేపీ నేత గట్టు రామచంద్రరావు, ఎంఐఎం నేత సయ్యద్‌ ఎహెసాన్‌ జాఫ్రీ, బీఎస్పీ నేతలు పాల్గొన్నారు.

25 వరకు నామినేషన్ల స్వీకరణ... 
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థుల నుంచి ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్లు స్వీకరించనున్నామని రజత్‌ కుమార్‌ తెలిపారు. ఈ వ్యవధిలో సెలవు రోజులైన హోలీ, ఆదివారం మాత్రం నామినేషన్లు స్వీకరించబోమని స్పష్టం చేశారు. కొందరు ఎన్నికల సిబ్బంది ఇంకా విధుల్లో చేరలేదని, వారు వెంటనే బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్ర సరిహద్దుల్లో భద్రతపై అన్ని రాష్ట్రాల అధికారులతో సమన్వయం ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ ఉంటుందని, సమస్యాత్మక నియోజకవర్గాల్లో మాత్రం 4 గంటల వరకే పోలింగ్‌ ఉండేలా ప్రతిపాదించినట్లు రజత్‌ తెలిపారు. సాధారణంగా ఒక వ్యక్తి రూ. 50 వేల కంటే ఎక్కువ నగదును పెట్టుకోరాదని, ఆధారాలు తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుందన్నారు. కాగా, ఎన్నికల సిబ్బందిపై సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె. జోషితో రజత్‌ కుమార్‌ సోమవారం సమావేశమయ్యారు. అన్ని జిలాల్లో రిటర్నింగ్‌ అధికారులు ఉన్నారని, అయితే కొన్ని ఏఆర్‌ఓ స్థానాలు భర్తీ చేయాల్సి ఉందన్నారు. అలాగే మిగతా రాష్ట్రాలకు పరిశీలకులుగా పంపాల్సిన ఐఎఎస్‌ అధికారుల జాబితాపైనా చర్చించారు.

బీజేపీ జేబు సంస్థగా ఈసీ: కాంగ్రెస్‌

మొదటి విడతలోనే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించడం సరైంది కాదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ బీజేపీ జేబు సంస్థగా మారిందని ఆరోపించారు. సీఈఓతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రంజాన్‌ మాసంలో పశ్చిమ బెంగాల్‌లో ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనుండటంతో అక్కడ గణనీయ సంఖ్యలో ఉన్న ముస్లిం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడం కష్టం కానుందన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అనేక కోడ్‌ ఉల్లంఘన కేసులు నమోదు అయ్యాయని, అధికార టీఆర్‌ఎస్‌ నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. సుమోటోగా కేసులు నమోదు చేసే అధికారం ఉన్నప్పటికీ ఈసీ ఎందుకు దృష్టిసారించడం లేదన్నారు. ఎన్నో పోరాటాలు చేసిన తనకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్‌ స్లిప్‌ రాలేదని, ఇది కుట్ర పూరితంగా జరిగిందన్నారు. రాష్ట్రంలో ఓట్ల నమోదు, తొలగింపు విషయంలో టీఆర్‌ఎస్, ఎంఐఎం కలసి కుట్ర చేస్తున్నాయన్నారు. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)