రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఎన్నికలు.. ఎన్నో విశేషాలు..
Published on Tue, 11/20/2018 - 08:54
సాక్షి, ఆలేరు : భారత ఎన్నికల సంఘం కాలక్రమేణ ఎన్నో సంస్కరణలు చేపట్టింది. ఎన్నికల సంఘం స్వంతంత్ర రాజ్యంగ వ్యవస్థ. నిర్ణయాలు స్వతంద్రంగా తీసుకుంటుంది. దేశ వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించే సమయంలో సుమారు 50లక్షల మంది ఉద్యోగుల సేవలను వినియోగించుకుంటోందని ఓ అంచనా.
- దేశంలో మొదటి సాధారణ ఎన్నికలు హిమాచల్ప్రదేశ్లోని ‘చిని’లో నిర్వహించారు
- దేశంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 17.30కోట్లు అని నివేదికలు తెలుపుతున్నాయి
- 1993లో జరిగిన 13వ సాధారణ ఎన్నికల్లో మొదటిసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను వినియోగించారు.
- గతంలో ఓటు హక్కుకు కనీస వయస్సు 21 సంవత్సరాలు కాగా 61వ రాజ్యాంగ సవరణలో18 సంవత్సరాలకు కుదించారు
- ఎన్నికల నిర్వహణలో సమూల సంస్కరణలు ప్రవేశపెట్టిన సమర్థుడిగా పదో ఎన్నికల సంఘం కమిషనర్గా టీఎన్ శేషన్ గుర్తింపు పొందారు.
- 1952లో 55పార్టీలు ఎన్నికల్లో పాల్గొనగా 2014 నాటికి ఆ సంఖ్య 370కి చేరింది.
- దేశంలో ఎంపీలుగా గెలిచిన వారిలో 30శాతం మందిపై పలు కేసులు నమోదయ్యాయని బీబీసీ నివేదిక పేర్కొంది.
#
Tags