ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చిన్నారులపై చిన్న చూపేలా?
Published on Sat, 07/20/2019 - 02:48
సాక్షి, హైదరాబాద్: తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు, చెత్తకుప్పల్లో, ముళ్లపొదల్లో దొరికిన పిల్లలు, లైంగిక దాడులకు గురైన చిన్నారులకు కుటుంబ వాతావరణం కల్పించి వారి బాగోగులు చూడాల్సిన శిశు విహర్ కేంద్రాలు ఆ దిశగా పనిచేయడం లేదని బాలల హక్కుల సంఘం మండిపడింది.
ఇటీవల హైదరాబాద్లోని యూసఫ్గూడ శిశు విహార్ కేంద్రంలో 4 రోజుల వయసున్న నిత్య తలకు గాయమై, 9 నెలల వయసున్న సత్యశ్రీ ఫంగల్ ఇన్ఫెక్షన్తో మృత్యువాత పడ్డారు. ఈ ఘటనల్లో సిబ్బంది నిర్లక్ష్యం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ శిశు విహార్ కేంద్రంలో సిబ్బంది నిర్లక్ష్యంతోనే చిన్నారులు మృతి చెందారని, వారి మరణానికి కారణమైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం బాలల హక్కుల సంఘం హెచ్ఆర్సీలో పిటిషన్ వేసింది.
#
Tags