దద్దరిల్లిన రాజానగరం
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మబ్బే మసకేసిందిలే...
Published on Sun, 06/07/2015 - 09:56
హైదరాబాద్: అసలే ఆదివారం ఆపై ఆకాశం మబ్బులు కమ్మేయడంతో భాగ్యనగర వాసులు ముసుగుతన్నారు. నిన్నామొన్నటి వరకు ఉక్కపోతలతో అల్లాడిన హైదరాబాదీలు వాతావరణం చల్లబడడంతో సేదతీరారు. ఆదివారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతం కావడంతో భాగ్యనగరం అంతా కాస్త చీకటి అలముకుంది.
సూర్యుడు మబ్బులు చాటున దాక్కోవడంతో ఉదయం 10 గంటలైనా వెలుతురు జాడే లేదు. సెలవు రోజు కూడా కావడంతో భాగ్యనగర వాసులు మంచం దిగేందుకు ఇష్టపడలేదు. ఆదివారం రోజున ఆలస్యంగా నిద్రలేచే హైదరాబాదీలు ఈరోజు మరింత బద్దకించారు. చిరుజల్లులతో వాతావరణం చల్లగా ఉండడంతో మరింతగా మంచానికి అతుక్కుపోయారు. అత్యవసర పనులు, పెళ్లిపేరంటాలు ఉన్నవారు మంచం దిగక తప్పలేదు.
#
Tags