దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్
Published on Tue, 12/17/2019 - 02:56
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మంగళవారం ఉదయం 11 గంటలకు యాదాద్రి ఆలయాన్ని సందర్శించనున్నారు. అక్కడి నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. రూ.235 కోట్ల తో చేపట్టిన ఆలయ పునరుద్ధరణ పనులు దాదాపు పూర్తయ్యాయి. రోడ్ల నిర్మాణం, భూసేకరణ కోసం రూ.109 కోట్లు, టెంపుల్ సిటీలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.103 కోట్లు ప్రభుత్వం వెచ్చించింది. ఈ పనుల పురోగతిని సీఎం పరిశీలించనున్నారు. వచ్చే ఫిబ్రవరిలో యాదాద్రిలో మహాసుదర్శన యాగం నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. 3,000 మంది రుత్వికులు, 3,000 మంది వేద పారాయణదారులు, 3,000 మంది సహాయకులు యాగంలో పాల్గొననున్నారు. 1,048 కుండాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ పర్యటనలో యాగం తేదీలను కేసీఆర్ ప్రకటించే అవకాశముంది.
#
Tags