రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు
Published on Wed, 02/07/2018 - 18:55
మహబూబ్నగర్ న్యూటౌన్: తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మామిడి ఉత్పత్తులపై సర్వే నిర్వహించి అంచనాలు సిద్ధం చేయాలని కలెక్టర్ రొనాల్డ్రోస్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మామిడి అధికంగా ఉత్పత్తి అయ్యే బాలానగర్, రాజాపూర్, నవాబ్పేట, దామరగిద్ద, కోస్గి, గండీడ్ మండలాల్లో రైతులకు వచ్చే ఆదాయం, ఉత్పత్తులు వంటి వివరాలతో నివేదికను గురువారం లోగా సమర్పించాలన్నారు. అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పి మామిడి ఉత్పత్తులను అమ్మితే మంచి ధరలు వచ్చే అవకాశముందని తెలిపారు. సమావేశంలో డీఆర్డీఓ ఆనంద్కుమార్, ఉద్యానవన శాఖ అధికారి సరోజినిదేవి, డీపీఎం నాగమల్లిక పాల్గొన్నారు.
#
Tags