amp pages | Sakshi

చెరువులో నిర్మాణాలు!

Published on Fri, 04/19/2019 - 08:42

రాజేంద్రనగర్‌ :  దశాబ్దాల కాలంపాటు సాగు, తాగునీరందించిన చెరువు ఇప్పుడు కబ్జాలతో కుచించుకుపోతోంది. చెరువులోకి వరదనీరు రాకుండా కాలువలను దారి మళ్లించి యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల సమన్వయలోపంతో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. పీరం చెరువు ప్రాంతంలోని సర్వేనెంబర్‌ 27లో 4.25 ఎకరాల విస్తీర్ణంలో కోమటికుంట చెరువు విస్తరించి ఉంది. రెవెన్యూ రికార్డుల్లో చెరువుతో పాటు ఎఫ్‌టీఎల్‌ను నిర్థారించి హద్దులను ఏర్పాటు చేశారు. గతంలో ఈ ప్రాంతమంతా పచ్చటి పొలాలతో కళకళలాడేది. చెరువు పక్కనే ఉన్న వ్యవసాయ భూములకు ఈ నీరే ఉపయోగపడేది. ఈ చెరువులోనే వర్షాకాలంలో ఎగువ ప్రాంతం నుంచి నీరు చేరేది. సంవత్సరం పొడవునా నీటితో వెంకన్నకుంట కళకళలాడేది. చుట్టుపక్కల వారు తాగేందుకు దీని నీటిని ఉపయోగించేవారు. అయితే, ప్రస్తుతం చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూములు ప్లాట్లుగా మారి నిర్మాణాలు వెలిశాయి.

దీంతో ఈ ప్రాంతంలో భూమికి విలువ పెరిగింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో గజం స్థలం రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు పలుకుతోంది. ఈ చెరువులోకి కొందరు వర్షపు నీరు రాకుండా కాలువలను మూసివేశారు. తమ పంట పొలాలను ప్లాట్లుగా చేసిన సమయంలో చెరువుకు వచ్చే కాలువలు, తూములను తొలగించి నిర్మాణాలు చేపట్టారు. దీంతో ప్రస్తుతం వరదనీరు చేరడం లేదు. చెరువు భూమిని కబ్జా చేసేందుకు కొందరు ముందస్తు ప్రణాళికతో నిర్మాణాలను ప్రారంభించారు. తమ స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నామంటూ.. ఎఫ్‌టీఎల్‌ భూముల్లో మొదటగా నిర్మాణాలు పూర్తి చేశారు. దీనిని ఇరిగేషన్‌ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు ప్రశ్నించకపోవడంతో ఏకంగా చెరువు స్థలంలోనే నిర్మాణాలు వెలిశాయి. కొన్ని రోజులుగా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఎన్నికల విధుల్లో ఉండటంతో అదనుగా భావించి జోరుగా నిర్మాణాలు చేపట్టారు. ఈ విషయమై స్థానికులు ఫిర్యాదు చేసినా పని ఒత్తిడిలో అధికారులు చర్యలు చేపట్టలేదు. ఇదే అదునుగా భావించి కబ్జాదారులు ప్రçహారీ నిర్మాణాలను చేపడుతున్నారు. స్థానికంగా ఈ చెరువును ఆధునికీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం మిషన్‌ కాకతీయ పథకంలో భాగంగా నిధులు కేటాయించింది. రూ.3 లక్షలతో చెరువు కట్ట ఎత్తును పెంచారు. అనంతరం వివిధ అభివృద్ధి పనులను నిర్వహించాల్సి ఉండగా.. నిర్మాణాలు జరుగుతుండడంతో ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. దీంతో కబ్జాదారులకు పనులు మరింత సులభం అయ్యాయి. ఇప్పటికైనా రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు స్పందించి చెరువు స్థలాన్ని కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌