సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..
Breaking News
తిప్పాపూర్ వాసికి కరోనా లక్షణాలు
Published on Mon, 03/23/2020 - 08:59
సాక్షి, భిక్కనూరు: కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం తిప్పాపూర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి కరోనా లక్షణాలు కనిపించడంతో పోలీసులు వైద్యసిబ్బంది ఆదివారం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. తిప్పాపూర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి గత పదేళ్లుగా మస్కట్ దేశానికి ఉపాధి నిమిత్తం వెళ్లి రెండు సంవత్సరాలు ఒక్కసారి ఇండియాకు వస్తుంటాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 27న మస్కట్ నుంచి స్వగ్రామమైన తిప్పాపూర్కు వచ్చాడు. (కరోనా అనుమానితులపై కేసులు)
గత రెండు మూడు రోజులుగా అతను దగ్గుతుండడంతో చుట్టూ పక్కల వారు వైద్యసిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. రాజంపేట ప్రభుత్వాసుపత్రి వైద్యుడు శిరి‹Ùకుమార్, భిక్కనూరు ఎస్సై నవీన్కుమార్ తో కలిసి అతనికి ఇంటికి వచ్చి కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రత్యేక వాహనంలో అతనిని కరోనా నిర్ధారణ పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
Tags