నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అప్పులబాధతో పత్తి రైతు ఆత్మహత్య
Published on Sat, 01/23/2016 - 14:43
చింతపల్లి: పత్తి పంట పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో పాటు కూతురు వివాహం కోసం చేసిన అప్పు ఎక్కువవడంతో.. వాటిని తీర్చే దారి కానరాక ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం కొక్కిరాల తండలో శనివారం చోటు చేసుకుంది.
తండాకు చెందిన కొర్ర భాను(44) తనకున్న రెండున్నర ఎకరాల భూమితో పాటు మరో ఐదున్నర ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి పంట సాగు చేశాడు. ఆశించిన మేర దిగుబడి రాకపోవడంతో.. పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పలు పెరిగిపోయాయి. దీనికి తోడు వారం రోజుల క్రితమే కూతురు వివాహం కోసం కూడా అప్పు చేశాడు. అవి తీర్చడం గురించి మధన పడుతున్న భాను ఈ రోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags